ఇదేనా జగన్.. మీరు చెప్పిన ఊళ్లు..
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది.
జగనన్న కాలనీల్లో కనీస వసతులు కరవు
గృహ నిర్మాణాలకు ఆసక్తి చూపని లబ్ధిదారులు
‘కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పేదల సొంతిటి కల నెరవేరుస్తున్నాం. రూ.లక్షల విలువ చేసే ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాను’
జగనన్న కాలనీల విషయంలో సీఎం చెప్పిన మాటలివీ..
‘ఊరికి దూరంగా ఇంటి స్థలం చూపించారు.. అక్కడే ఇల్లు కట్టుకోవాలని చెప్పారు.. తీరా చూస్తే ఆ ప్రాంతంలో దారి సరిగ్గా లేదు.. వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం ఏమీ కల్పించలేదు. ఇల్లు కట్టుకుందామంటే ఇసుక కూడా దొరకట్లేదు. అయిదేళ్ల పాలన పూర్తయినా మా సొంతింటి కల నెరవేరలేదు’
ఇది క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆవేదన
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్, బూర్జ, నరసన్నపేట, కోటబొమ్మాళి, రణస్థలం, కవిటి గ్రామీణం, జలుమూరు, టెక్కలి పట్టణం, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు
జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అంటూ ముఖ్యమంత్రి, వైకాపా నాయకులు ఊదరగొట్టారు. పూర్తిస్థాయి మౌలిక వసతులతో పట్టణాల మాదిరిగా తయారవుతాయని ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తున్న సాయం పునాదులు, గోడలు నిర్మించడానికే సరిపోతోంది. సామాన్యులకు ఇసుక బంగారమైపోయింది. ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూలీ ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి కనీసం రూ.ఆరేడు లక్షలు ఖర్చవుతోంది. కొన్నిచోట్ల శ్లాబు వేసిన ఇళ్లలో లోపల పనులు పూర్తి చేయకుండా రంగులు వేసి ఆదరాబాదరాగా సామూహిక గృహప్రవేశాలు పూర్తి చేశారు. ఇప్పటికీ వాటిలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులకు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లకు అద్దె చెల్లించక తప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
కొన్నిచోట్ల మరీ దారుణం..
జిల్లాలోని కొన్ని మండలాల్లోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పరిస్థితి దారుణంగా ఉంది. సారవకోటలో 421 గృహాలకు కేవలం 7 మాత్రమే పూర్తయ్యాయి. హిరమండలంలో 445కి 10, కొత్తూరులో 1,050కి 19, ఎల్.ఎన్. పేటలో 348కి 20 చొప్పున ఇళ్లు మాత్రమే కట్టారు.
అసంపూర్తిగా కుళాయిల ఏర్పాటు
నరసన్నపేట మండలం తామరాపల్లి లేఅవుట్లో 29 మందికి అయిదుగురే ఇళ్లు నిర్మించారు. ఇక్కడ తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇంటింటా కుళాయి ఏర్పాటు పనులను ఇలా అసంపూర్తిగా చేశారు. జమ్ము గ్రామంలోని లేవుట్లో 35 మందికి ఇళ్లు కేటాయించగా నాలుగు కుటుంబాలే నివాసముంటున్నాయి. బావుల నుంచి వాడుక నీరు తెచ్చుకుంటున్నారు. తాగడానికి కొనుగోలు చేస్తున్నారు. రహదారులు, కాలువలు నిర్మించలేదు.
మంజూరు 260.. నిర్మాణం 4
టెక్కలి పరిధి అంజనాపురం వద్ద జగనన్న లేఅవుట్లో మౌలిక వసతులు లేక లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావట్లేదు. ఇక్కడ 260 మందికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయగా.. నాలుగు గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. కాలనీ పట్టణానికి దూరంగా ఉండటంతో సగం మంది పునాదులు వేయలేదు. బోరు నుంచి నీరు రాకపోవడంతో లబ్ధిదారులు ట్యాంకర్లతో నీరు రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు, రహదారి సౌకర్యం లేదు.
పనికిరాని మొక్కల మధ్యనే ఆవాసం
బూర్జ మండలం చీడివలస వద్ద జగనన్న కాలనీలో 23 మందికి స్థలాలు కేటాయించారు. ఇక్కడికి చేరుకునే రహదారి ఎత్తు పల్లాలుగా మట్టి కుప్పలతో ఉంది. అరకొరగా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. కుళాయిలు లేక లబ్ధిదారులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఇళ్ల మధ్యలో పనికిరాని మొక్కలు పెరిగాయి. ఏడుగురు లబ్ధిదారులు గృహప్రవేశం చేసినప్పటికీ రెండు కుటుంబాలే నివాసముంటున్నాయి.
చినుకు పడితే బురదే..
వజ్రపుకొత్తూరు వద్ద జగనన్న కాలనీలో 57 మందికి స్థలాలు కేటాయించగా 10 మినహా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఏడుగురు గృహప్రవేశం చేయగా రెండిళ్లలోనే నివాసముంటున్నారు. రహదారి, మురుగు కాలువలు, తాగునీటి సదుపాయం కల్పించలేదు. చిన్న వర్షం పడినా దారులన్నీ బురదమయమవుతున్నాయి.
బోరు.. పట్టించుకోరు..
జలుమూరులో జగనన్న కాలనీకి జర్జంగి-పిండ్రువాడ రహదారి నుంచి వెళ్లడానికి సరైన మార్గం లేదు. వర్షాకాలంలో కాలినడకన వెళ్లడం కష్టమే. ఇక్కడ 56 ఇళ్లు మంజూరు కాగా ఐదుగురు గృహప్రవేశం చేశారు. బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడే లేకుండా పోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
బిల్లులు రాక.. పునాది దశలోనే..
కవిటి మండలం భైరిపురం వద్ద చెరువు పక్కన 169 మందికి పట్టాలు ఇచ్చారు. 52 మంది పునాదులు వేశారు. ఎనిమిది ఇళ్లు శ్లాబు వరకు నిర్మించారు. రెండు బోర్లు ఏర్పాటు చేసినా నీరు సక్రమంగా అందట్లేదు. ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు.
అందుకే ప్రారంభించలేదు..
మందస మండలం హరిపురం ప్రాంతంలో ప్రభుత్వ భూములుండగా జగనన్న కాలనీ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో లేఅవుట్ వేశారు. 52 మందికి పట్టాలిచ్చారు. సిమెంట్ రోడ్లు, కాలువలు లేవు. చిన్నపాటి వర్షం కురిసినా అడుగు పెట్టలేని పరిస్థితి. అందుకే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
కొంచాడ సురేష్, లబ్ధిదారుడు, హరిపురం
సౌకర్యాలుంటేనే కట్టుకుంటాం..
టెక్కలి పరిధి అంజనాపురం సమీపంలో ప్రభుత్వం స్థలం కేటాయించి ఏళ్లు గడిచినా కనీస వసతులు కల్పించలేదు. ప్రైవేటు లేఅవుట్లకు నిబంధనలు పెట్టే అధికారులు రహదారి సౌకర్యం లేకుండా ఇళ్ల నిర్మాణానికి ఎలా అనుమతించారో అర్థం కావట్లేదు. పక్కనే గ్రానైట్ క్వారీ, స్టోన్ క్రషర్ ఉండటంతో పెద్దఎత్తున దుమ్ము వెలువడుతోంది. అత్యంత సమీపం నుంచి విద్యుత్తు టవర్ లైన్లు వెళ్తున్నాయి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తేనే ఇల్లు నిర్మించుకోగలం.
దూపాన గౌతమిరెడ్డి, టెక్కలి
జిల్లా వివరాలు ఇలా..
మొత్తం జగనన్న లేఅవుట్లు: 794 నిర్మించాల్సిన ఇళ్లు: 49,810 పూర్తయినవి: 8,416 పనులు ప్రారంభించనివి: 976 పునాది దశ దాటనివి: 13,631 వివిధ స్థాయిల్లో ఉన్నవి: 21,229
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల విధ్వంసానికి నిదర్శనం
[ 26-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో కొండలను పిండి చేసేశారు.. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు.. అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేశారు.. అధికార అండతో నేతలు చెలరేగిపోయారు. -
మూడు రాజధానుల పేరుతో మాయచేశారు
[ 26-07-2024]
‘అమరావతిని రాజధాని చేయాలనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు రైతుల్ని ఒప్పించి భూములు సేకరించారు. -
కొత్తవి లేవు.. పాతవి పనికిరావు..!
[ 26-07-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తున్నా అందుకు తగినట్లుగా నిరుద్యోగులకు సదుపాయాల కల్పనలో పౌర గ్రంథాలయశాఖాధికారులు విఫలమవుతున్నారు. -
జిల్లా విద్యాశిక్షణ సంస్థకు మహర్దశ
[ 26-07-2024]
జిల్లా విద్యాశిక్షణ సంస్థ(డైట్) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) కింద ఉపాధ్యాయ విద్య బలోపేతానికి చర్యలు చేపడుతోంది. -
బీపీసీఎల్ ఏర్పాటుకు కసరత్తు
[ 26-07-2024]
జిల్లా అభివృద్ధికి సమగ్ర కసరత్తు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఈనెల 19న టెక్కలిలో ప్రకటించారు. -
41 మంది తహసీల్దార్ల బదిలీ
[ 26-07-2024]
సార్వత్రిక ఎన్నికల ముందు ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహసీల్దార్లు తిరిగి సొంత జిల్లాలకు వెళ్తున్నారు. -
వాలంటీరు త్రిపాత్రాభినయం..!
[ 26-07-2024]
‘గ్రామ వాలంటీరును ప్రభుత్వం తరఫున హాకీ శిక్షకుడిగా ఎలా కొనసాగిస్తారు’ అని చాపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మణరావు ఇటీవల కలెక్టర్ నిర్వహించిన ‘మీకోసం ప్రజా పరిష్కార వేదిక’లో ఫిర్యాధు చేశారు. -
వీరులారా వందనం..!
[ 26-07-2024]
దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరిట కార్గిల్ నుంచి పాకిస్థాన్ చొరబాటుదారులపై యుద్ధభేరి మోగించింది. -
విద్యార్థినికి తీవ్ర గాయాలు
[ 26-07-2024]
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన ఘటన శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. -
గజదొంగ అరెస్టు
[ 26-07-2024]
జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ యోగేశ్ గౌతం తెలిపారు. -
సర్వజనాసుపత్రిలో కుని శస్త్రచికిత్స అనంతరం మహిళ మృతి
[ 26-07-2024]
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ కొన్ని గంటల తర్వాత మృతి చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!