అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది.
అయిదేళ్లుగా పనులను పట్టించుకోని సర్కారు
భూసేకరణ సమస్యలకు చూపని పరిష్కారం
వైకుంఠపురం- అల్లిపల్లిగూడ సమీపంలోని స్లూయిజ్ వద్ద పరిస్థితి
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. కనీసం భూసేకరణ సమస్యలకు సైతం గ్రహణం వీడలేదు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం కాలువ పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించక పోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ప్రాధాన్యతా పనుల్లో రెండు నదుల అనుసంధానాన్ని చేర్చి 2020 జూలై నాటికి పూర్తిచేస్తామని చెప్పింది. తీరా ఇప్పటి వరకు ఆరుసార్లు గడువు పెంచింది. ఈ ఏడాది జూన్ నాటికి ఏడో గడువు ముగియనుండటం గమనార్హం.
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
పూర్తయితే ప్రయోజనాలివీ..
నాగావళి- వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న కృతనిశ్చయంతో తెదేపా హయాంలో ప్రతిపాదనలు చేశారు. 33.583 కి.మీ. పొడవునా 600 క్యూసెక్కుల సామర్థ్యంతో రూ.145 కోట్ల అంచనా వ్యయంతో 2017-18లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. గుత్తేదారుడు రూ.78.96కోట్లకు పనులు సొంతం చేసుకొని ఇప్పటి వరకు రూ.55.28 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పూర్తిచేశాడు. ఈ పనులు పూర్తయితే 5 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు, నారాయణపురం ఆనకట్ట దిగువనున్న 33,500 ఎకరాలకు సాగునీరందించవచ్చు. ఓవీపేట పరిధిలో ఎత్తిపోతల పథకం నిర్మించి మరో 600 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల పరిధిలో భూసేకరణ చేయడంతో పాటు సుమారు 60 శాతం పనులు శరవేగంగా జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లింపుల్లో తీవ్రంగా జాప్యం చేయడం ఏడాదిన్నర పాటు పనులు నిలుపుదల చేయడం తదితర కారణాలతో గత నాలుగేళ్లుగా కేవలం 20 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఇటీవల పనులు ప్రారంభించినా అవి నత్తతో పోటీపడుతున్నాయి.
మిగిలిన వాటికి మోక్షమెప్పుడో
రెండేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తయిన చోట పట్టించుకోక పోవడంతో కాలువల్లో ఎక్కడికక్కడ పనికిరాని మొక్కలు ఏపుగా పెరిగాయి. 33.583 కి.మీ. కాలువకు గానూ సుమారు 30 కి.మీ. మేర మట్టి పనులు పూర్తయినా.. చాలావరకు ఇవి పూడుకు పోయాయి. 3.583 కి.మీ. పనులు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. కాలువపై చేపట్టాల్సిన 66 నిర్మాణాలకు గాను 34 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 7 నిర్మాణాలు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. గేట్లు, హెడ్ రెగ్యులేటర్స్, క్రాస్ రెగ్యులేటర్ పనులు, 10 డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణాలు ఇంకా చేపట్టాల్సి ఉంది.
తొలగని ఇబ్బందులు
అనుసంధాన కాలువ భూసేకరణలో సమస్యలకు గ్రహణం వీడలేదు. శ్రీరామవలస, చిగురువలస, లక్ష్మీపురం, బొట్టారుసింగి, డక్కరవలస, లంకాం, అమృతలింగాపురం, తదితర గ్రామాల్లో రైతుల భూముల సమస్యలు నేటికీ పరిష్కరించలేదు. అనుసంధాన కాలువ నిమిత్తం సుమారు 636.96 ఎకరాలకు గానూ 597 ఎకరాలు సేకరించారు. మరో 5.51 ఎకరాల దేవదాయ భూములకు సంబంధించి రైతులకు పరిహారం అందించలేదు. 34 ఎకరాలకు రూ.6.92 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. కేవలం 5.51 ఎకరాల భూమిని సేకరించాల్సిన చోట రైతులకు చెల్లించాల్సిన పరిహారం వద్ద వివాదంతో పనులు నిలిచిపోయాయి.
80 శాతం పూర్తి
2017- 18లో ప్రారంభమైన నాగావళి- వంశధార నదుల అనుసంధాన పనులకు ఆరుసార్లు గడువు పెంచారు. 2018 జులైలో మొదటి గడువు పూర్తయ్యే నాటికి 58 శాతం పనులు పూర్తయ్యాయి. 2019 నవంబరుకు 60 శాతం, 2020 జులైకు 65 శాతం, 2022 ఆగస్టుకు 70 శాతం, 2022 డిసెంబరుకు 80 శాతం పనులు పూర్తయ్యాయని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. 2023 జూలై 30 నాటికి ఆరోసారి గడువు పూర్తికానుంది. బిల్లులు చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో గుత్తేదారుడు రెండున్నరేళ్లుగా పనులు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. గతేడాది జూన్ 17న ప్రభుత్వం రూ.3.52 కోట్లు చెల్లించింది. ఇక పనులు వేగంగా జరుగుతాయన్న తరుణంలో వర్షాలు పడటంతో పురోగతి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట