జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది.
బస్సు యాత్రకు ఆదరణ కరవు
అడుగడుగునా ఆంక్షలతో తప్పని అవస్థలు
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, టెక్కలి, శ్రీకాకుళం అర్బన్, పలాస గ్రామీణం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నరసన్నపేట: జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు విసిగిపోయారు. బస్సులో నుంచే సీఎం జగన్ నమస్కారం పెడుతూ.. నవ్వులు చిందిస్తూ ముందుకుసాగారు.
దాదాపు రెండున్నర గంటల పాటు జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు
ఆయన కోసం ఎంతో మంది గంటల కొద్దీ మండుటెండలో నిరీక్షించలేక అల్లాడిపోయారు. టెక్కలి వద్ద అక్కవరం సమీపంలో సభ జరిగింది. మధ్యాహ్న భోజన విడిది పరశురాంపురం కూడలి నుంచి టెక్కలి కూడలి వరకు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నియంత్రించారు. జాతీయ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బహిరంగ సభకు జనాన్ని తరలించిన బస్సులను రోడ్డుపై నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తూరు, హిరమండలం, మందస, ఇచ్ఛాపురం నుంచి తరలించిన మహిళలు, వృద్ధులు సామాజిక పింఛన్ల లబ్ధిదారుల్లో కొందరు బస్సులకే పరిమితమయ్యారు.
జాతీయ రహదారిపై నిలిపిన ఆర్టీసీ బస్సులు
పోలీసులు ఎక్కువ.. ప్రజలు తక్కువ..
శ్రీకాకుళం: పెద్దపాడు వద్ద జాతీయ రహదారిపై అడ్డంగా తాడు కట్టి వాహనాలను నిలిపివేసిన పోలీసులు
బస్సు యాత్రకు జనాదరణ కరవైంది. శ్రీకాకుళం నుంచి అక్కవరం వరకు రహదారి పొడవునా కార్యకర్తలు, నాయకులు జగన్కు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చినా శ్రేణులు పట్టించుకోలేదు. ఫలితంగా రోడ్డుపై ప్రజల కంటే పోలీసులే ఎక్కువ మంది కనిపించారు. మంత్రి ధర్మాన ఇలాకాలోని చాపురం, పాత్రునివలస, పెద్దపాడు ప్రాంతాల్లో కార్యకర్తల జాడే కానరాలేదు. రోడ్లపై కార్యకర్తల సందడి తగ్గడంతో యాత్ర బోసిపోయింది.
కోటబొమ్మాళి సమీపంలో రహదారికి అడ్డంగా నిలిపిన పోలీసు జీపు
ముందే వెనుదిరిగారు..
ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా వెనుదిరుగుతున్న జనం
ఎండవేడి తాళలేక సభ ప్రారంభానికి గంట ముందే చాలా మంది వెనుదిరిగారు. కొందరు సీఎం ప్రసంగిస్తున్న సమయంలో జారుకున్నారు. టెక్కలికి చెందిన మహిళలు వారికి ఇచ్చిన కూపన్లు పట్టుకుని వెనక్కి వెళ్లారు. కొందరు మందుబాబులు మద్యం మత్తులో తూలుతూ పడి ఉండటం కనిపించింది. సభ ప్రారంభమయ్యే సమయానికి ఈదురు గాలులు వీయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఓవైపు జీఎన్ పేట వద్ద.. మరోవైపు టెక్కలి జగతిమెట్ట కూడలి వద్ద వాహనాలను నిలిపివేశారు. జనాన్ని తరలించిన బస్సులను ఐదు కిలోమీటర్ల ముందే నిలిపివేయడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు సభకు చేరుకోలేకపోయారు. వారంతా బస్సుల్లోనే ఉండిపోయి వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే