logo

మహేంద్రతనయ నదిలో దిగి కొసమాల వాసి జలసమాధి

గజపతి జిల్లా గోసాని బ్లాక్‌లోని బాగుసాల పంచాయతీ సదర్‌ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు.

Published : 21 May 2024 03:13 IST

మెళియాపుట్టి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా గోసాని బ్లాక్‌లోని బాగుసాల పంచాయతీ సదర్‌ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర సరిహద్దులోని మెళియాపుట్టి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొసమాల గ్రామానికి చెందిన పేదింటి సాయిరాజు  (25) స్నేహితుడితో కలిసి బాగుసాల గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గ్రామంలోని దేవాలయం దగ్గర ప్రవహించే మహేంద్రతనయ నదిలో స్నానం చేసేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు నదీగర్భంలో లోతైన చోటుకు చేరి మునిగిపోయాడు. అతని స్నేహితుడు రక్షించమని కేకలు వేయగా నదిలో మరోచోట ఈత కొడుతున్న యువరాజ్‌పూర్‌ గ్రామస్థులు వచ్చి అతనిని అతికష్టం మీద  ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతి చెందాడు. గ్రామస్థులు వెంటనే గురండి పోలీసులకు సమాచారం అందించగా పోలీసు అధికారి రవీంద్ర పోటే, సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పర్లాఖెముండిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురండి పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు