పట్టణంలో దాహం కేకలు
ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు.
అంతంతమాత్రంగా నీటి సరఫరా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
న్యూస్టుడే, ఇచ్ఛాపురం
ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు. దీంతో సరఫరా చేస్తున్న నీరు చాలక, నీటి వనరులు అడుగంటి ప్రజలు అల్లాడుతున్నారు. నీటి డబ్బాలు కొనుగోలు చేసుకుంటున్నారు. వేసవి దృష్ట్యా పట్టణంలో బాటసారుల కోసం రెండు చలివేంద్రాలకు రూ.70వేలు వెచ్చిస్తున్న పురపాలకసంఘం, పన్నులు చెల్లించే ప్రజల అవస్థలను పట్టించుకోవడం లేదని, ఎన్నికల నెపంతో అటు పాలకులు, ఇటు అధికారులు తప్పించుకుంటున్నారని సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది.
రోజుకు 100 లీటర్ల నీరు ఇవ్వాలి
సుమారు 45 వేల జనాభా కలిగిన పురపాలకసంఘంలో ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్ల నీరు అవసరం. కానీ 40 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. అడిగితే సరిపడా ట్యాంకర్లు లేవని, నీటి లభ్యత తక్కువగా ఉందని అధికారులు కారణాలు చెబుతున్నారు. పలువురు దాతలు ప్రజా శ్రేయస్సు కోరి సొంత డబ్బులతో ట్యాంకరు అందజేసినా.. వినియోగించకపోవడంతో మూలకు చేరి నిరుపయోగంగా మారింది.
చాలా ఇబ్బందిగా ఉంది
- జె.సంతోష్, ఇచ్ఛాపురం
వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలు ఎక్కువగా లాలాపేట బావికి వచ్చి, మంచినీటిని తీసుకువెళ్తుండేవారు. ఈ ఏడాది ఇది కూడా ఎండిపోవడంతో, లాలాపేట ప్రాంతీయులు కూడా దూరప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. ట్యాంకరు రావడం లేదు.
నీటి డబ్బా కొనుగోలు చేస్తున్నాం
- రవిశంకర్ మహాపాత్ర్, ఇచ్ఛాపురం
కుళాయినీరు సక్రమంగా రాకపోవడంతో నీటివిక్రయ కేంద్రాల నుంచి నీటి డబ్బా కొనుగోలు చేస్తున్నాం. గతంలో వేసవి తీవ్రత రోజుల్లో రోజు విడిచి రోజు నీరు కుళాయిల ద్వారా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వడం లేదు.
ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం
- నల్లి రమేష్, పుర కమిషనర్
ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్యాంకరుతో 1, 2, 3 వార్డులకు, 3 వేల లీటర్ల ట్యాంకరుతో పట్టణ పరిధిలో నీరు అందిస్తున్నాం. ప్రస్తుతం పట్టణానికి, రత్తకన్న ప్రాంతాలకు కుళాయి నీరు సరఫరా జరుగుతోంది. నీరు తక్కువగా వచ్చే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల