ఆశలు నీరుగార్చేశారు..!
రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అటకెక్కిన నారాయణపురం కాలువ ఆధునికీకరణ
న్యూస్టుడే, ఎచ్చెర్ల, పొందూరు
రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఎచ్చెర్ల, పొందూరు మండలాలకు సాగునీరు అందించే ఈ కాలువ ఆధునికీకరణ పనులు ముందుకు సాగడం లేదు.. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) నిధులు రూ.49 కోట్లు మంజూరు చేసి పనులను సైతం పట్టాలెక్కించింది. ప్రభుత్వం మారిన తర్వాత కనీసం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఖరీఫ్కు అన్నదాతలు ఇబ్బందులు పడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నత్తనడకన పనులు..
ఆరేళ్ల కిందట జైకా నిధులు రూ.49 కోట్లతో ప్రారంభించిన ఆధునికీకరణ పనులు కనీసం 30శాతం కూడా పూర్తికాలేదు. వైకాపా పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గుత్తేదారుకు రూ.10 కోట్ల వరకు బిల్లులు బకాయిలు ఉండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట, తోటపాలెం, దుప్పలవలస, కొత్తపేట, పొన్నాడ, ధర్మవరం, కొంగరాం, కొంగరాం, ముద్దాడ, రామజోగిపేట, భగీరధపురం తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో ఖరీఫ్కు వరి సాగు చేపట్టే అవకాశం ఉంది. కాలువ పూడికతీత పనులు చేపట్టక పోవటం గుర్రపుడెక్క పేరుకుపోయి శివారు గ్రామాలకు సాగునీరందుతుందో లేదో ప్రశ్నార్థకంగానే చెప్పొచ్చు.
పూడిక తీయలేదు..
నారాయణపురం కుడి కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దశాబ్ధాల కిందట నిర్మించిన ఈ కాలువకు ఇప్పటి వరకు ఆధునికీకరణ పనులు చేయలేదు. దీంతో కాలువ శివారు ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా జూన్ రెండో వారంలో కాలువల ద్వారా చెరువులు నింపితే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవు. కొన్ని కారణాలతో జులై వరకూ ఆలస్యం అవుతోంది. అప్పటికీ రైతులు ఊబాలకు సమాయత్తం అవుతుండటంతో ఒకేసారి అందరికీ నీరు అవసరం అవుతుంది. శివారు మండలం ఎచ్చెర్లకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. నారాయణపురం కుడికాలువ ద్వారా ఖరీఫ్కు నీటి సరఫరా చేయాలంటే కాలువలో పూడిక తొలగించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ పనులు ప్రారంభించలేదు.
గుత్తేదారు ముందుకు రాలేదు..
- మురళీమోహన్రావు, డీఈ, జలవనరులశాఖ
జైకా నిధుల్లో రూ.17 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాం. అందులో గుత్తేదారుకు రూ.10 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో మిగిలినవి చేసేందుకు ముందుకు రావట్లేదు. రైతులకు సాగునీటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఈ నెలాఖరులోగా పూడికతీత పనులు చేయిస్తాం. పనులు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి