వేట లేదు.. భృతి అందలేదు
సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు.
నెల దాటినా అందని ప్రభుత్వ సాయం
ఆందోళనలో మత్స్యకారులు
న్యూస్టుడే, కవిటి గ్రామీణం
సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందుగానే భృతి అందిస్తామన్న పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. మరోవైపు అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో మత్స్యకార భృతి జమకాలేదు. దిక్కు తోచని స్థితిలో మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో ఏప్రిల్ 14 నుంచి వేట నిషేధం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి మత్స్యకారులకు ఎలాంటి ఉపాధి లేదు. ఇటీవల మత్స్య శాఖ అధికారులు సర్వే ద్వారా వేటకు వెళ్తున్న మత్స్యకారులను గుర్తించారు. వారి వివరాలను ఈ-మత్స్యకార పోర్టల్లో అప్లోడ్ చేశారు. 15 వేల మందికి పైగా ప్రభుత్వం నుంచి రూ.10 వేలు చొప్పున మత్స్యకార భృతి అందించాల్సి ఉంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు బోట్లు, వలలకు మరమ్మతులు చేసుకుంటారు.
అప్పులు చేసి జీవనం
వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా మత్స్యకార భృతి అందకపోవడంతో అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొందని మత్స్యకారులు వాపోతున్నారు. కొందరు ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టినట్లు చెబుతున్నారు. మత్స్య సంపద లేక మహిళలకూ ఉపాధి లేకుండా పోయింది. ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయ పనులు లేకపోవడం.. భృతి ఎప్పుడు వస్తుందో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
బతుకు భారం..
- సూరాడ లవన్న, మత్స్యకారుడు, కవిటి మండలం
వేట నిషేధ సమయంలో రెండు నెలల పాటు ఎలాంటి పనులు ఉండవు. ప్రభుత్వం ముందుగా భృతి ఇస్తే కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు సాయం అందకపోవడంతో జీవనం భారంగా మారింది. అప్పులు చేసి నిత్యావసర సరకులు కొనుగోలు చేస్తున్నాం.
ఒక పూటే భోజనం..
- చీకటి ఎర్రయ్య, మత్స్యకారుడు, ఇచ్ఛాపురం మండలం
మాకు వేట తప్ప మరో పని రాదు. నెల రోజులుగా వేట లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఒక పూట తిని మరో పూట పస్తులు ఉంటున్నాం. వేట నిషేధం నాటి నుంచి వలలు, పడవలు బాగు చేసుకుంటున్నాం. భృతి ముందుగా ఇచ్చి ఉంటే బాగుండేది. నిత్యావసర సరకులు తెచ్చుకోవడానికి ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
అర్హులందరికీ లబ్ధి..
- శ్రీనివాసరావు, జేడీ, మత్స్య శాఖ, శ్రీకాకుళం
జిల్లా వ్యాప్తంగా బోట్లు, మత్స్యకారుల వివరాలను ఈ-మత్స్యకార పోర్టల్లో నమోదు చేశాం. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అర్హులందరికీ భృతి అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం