కుస్తీమే సవాల్!
కుస్తీ పోటీలకు శ్రీకాకుళం నగర పరిధిలోని పెద్దపాడు పెట్టింది పేరు. ఇక్కడి పేదింటి బిడ్డలు జిల్లా, రాష్ట్రస్థాయిలో అడుగుపెట్టిన ప్రతిసారీ పతకాల పంట పండిస్తున్నారు.
జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్న పెద్దపాడు క్రీడాకారులు
సాధన చేస్తున్న క్రీడాకారులు
కుస్తీ పోటీలకు శ్రీకాకుళం నగర పరిధిలోని పెద్దపాడు పెట్టింది పేరు. ఇక్కడి పేదింటి బిడ్డలు జిల్లా, రాష్ట్రస్థాయిలో అడుగుపెట్టిన ప్రతిసారీ పతకాల పంట పండిస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో అండర్-17 విభాగంలో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం, అండర్-23 విభాగంలో 3 స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్లుగా నిలిచారు. ఝార్ఖండ్లోని రాంచీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అందులో సత్తా చాటేందుకు శ్రమిస్తున్నారు. వారిపై ‘న్యూస్టుడే’ కథనం..
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
తాత, మామల స్ఫూర్తితో..
ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేసిన కోరాడ సూర్య తల్లిదండ్రులు అప్పారావు, మంగమ్మ వ్యవసాయం చేస్తుంటారు. కుటుంబంలో తాతయ్య, మామయ్య కుస్తీ క్రీడాకారులే. వారిని ఆదర్శంగా తీసుకుని.. అంతకంటే మరింత రాణించాలని ఆరేళ్ల కిందట కుస్తీ సాధన ప్రారంభించాడు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు, సౌత్జోన్ పోటీల్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నానని చెబుతున్నాడు సూర్య.
తండ్రి కల నిజం చేయాలని..
డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న తోణంగి జ్యోతి కుమార్ యాదవ్ ఆరేళ్లుగా కుస్తీ సాధన చేస్తున్నాడు. తండ్రి అప్పారావు మార్కెట్లో కళాసీ. తల్లి రామలక్ష్మి రైతు కూలీ. అప్పారావు కూడా కుస్తీ ఆడేవారు. కుటుంబ సమస్యల కారణంగా దాన్ని వదులుకున్నారు. తండ్రి కలను నిజం చేయాలనే లక్ష్యంతో జ్యోతికుమార్ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 9 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. సైన్యంలో కొలువు సాధించి దేశ సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా...
పదో తరగతి చదువుతున్న తోనంగి ధనుంజయ కుస్తీ పోటీల్లో సత్తా చూపుతున్నాడు. తండ్రి డొంకయ్య సిమెంటు గోదాములో జట్టు కళాసీ. తల్లి లక్ష్మి రైతు కూలీ. కుస్తీపై ఆసక్తితో రెండేళ్ల నుంచి మెలకువలు నేర్చుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో 3 స్వర్ణాలు, 1 కాంస్య పతకం సొంతం చేసుకుని ఇటీవల జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అందులో పతకం సాధించి క్రీడాకోటాలో రైల్వే ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ఈ క్రీడాకారుడు.
అదరగొడుతున్న ఆటో డ్రైవర్ కొడుకు..
పెద్దపాడుకు చెందిన తిరుపతిరావు ఆటో డ్రైవర్. ఈయన కుమారుడు ఈదు జయకృష్ణ ఇటీవల జాతీయస్థాయి కుస్తీపోటీలకు ఎంపికయ్యాడు. జయకృష్ణ తల్లి రమాదేవి గృహిణి. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. మూడేళ్లుగా సాధన చేస్తున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 2 స్వర్ణాలు, 1 రజత పతకం సాధించాడు. జాతీయస్థాయిలో పతకం సాధించాలనేది లక్ష్యంతో నిరంతరం సాధన చేస్తున్నానని తెలిపాడు జయకృష్ణ.
దాతలు ప్రోత్సహించాలి..
జిల్లాలో సామర్థ్యం కలిగిన క్రీడాకారులకు కొదవలేదు. అరకొర వసతుల మధ్యే నిరంరతం సాధన చేస్తూ రాష్ట్రస్థాయిలో సత్తాచాటుతున్నారు. దాతలు స్పందించి.. డమ్మీలు, జిమ్ పరికరాలతో పాటు క్రీడాకారులకు పోషకాహారం సమకూరిస్తే.. తక్కువ కాలంలోనే జాతీయస్థాయిలో పతకాలు సాధిస్తారు.
బొట్ట గోవిందరావు, డీఎస్ఏ కుస్తీ శిక్షకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం