హవ్వా.. ఇది బస్టాండా
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం వేల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు ఇక్కడికి వస్తుంటారు.
రెండో డిపో వద్ద కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం వేల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు ఇక్కడికి వస్తుంటారు. వారికి కాంప్లెక్స్ వద్దకు రాగానే సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తతో పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. ఆవరణలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారే పరిస్థితి కూడా లేదు.
బస్సుల ప్లాట్ఫాం వద్ద ద్విచక్ర వాహనాల పార్కింగ్
ప్రయాణికుల నుంచి సెస్ వసూలు చేస్తున్న అధికారులు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పట్టించుకోవడం లేదు. కాలువలు శిథిలావస్థకు చేరి.. వర్షం పడితే ఏటా కాంప్లెక్స్ నీట మునుగుతున్నా స్పందన లేదు.. ప్రతిరోజూ శుభ్రం చేస్తున్న దాఖలాలు కూడా లేకుండా పోయాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు బస్సులు ఆగే ప్లాట్ఫాం వద్ద ద్విచక్ర వాహనాలను అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. రాత్రి వేళ మందుబాబులు మద్యం తాగుతూ.. ఖాళీ సీసాలను అక్కడే పడేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నారు.
ఆవరణలో చెత్త ఇలా......
మరుగుదొడ్ల సదుపాయమూ అంతంతమాత్రంగానే ఉండటంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై స్టేషన్ మేనేజర్ ఎల్.ఎస్.నాయుడు మాట్లాడుతూ కాంప్లెక్స్ ఆవరణను శుభ్రం చేయిస్తామని చెప్పారు. బయటప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి వేళ మద్యం తాగి సీసాలను పడేసి వెళ్లిపోతున్నారని, పర్యవేక్షణ పెంచుతామని చెప్పారు.
కాంప్లెక్స్ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు
న్యూస్టుడే, అరసవల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం