logo

ఎన్నాళ్లీ దారుణాలు..

వైకాపా గత ఐదేళ్ల పాలనలో రహదారుల దుస్థితి ఎలాగుందో చెప్పేందుకు ఈ చిత్రమే నిదర్శనం.. ఎక్కడ చూసినా అధ్వాన దారులే దర్శనమిస్తున్నాయి.

Published : 24 May 2024 05:06 IST

 వైకాపా గత ఐదేళ్ల పాలనలో రహదారుల దుస్థితి ఎలాగుందో చెప్పేందుకు ఈ చిత్రమే నిదర్శనం.. ఎక్కడ చూసినా అధ్వాన దారులే దర్శనమిస్తున్నాయి.. వజ్రపుకొత్తూరు మండలం పూండి నుంచి పీఎంపురం మీదుగా పల్లివూరు వరకు ఉన్న ప్రధాన  ఆర్‌అండ్‌బీ రహదారి ఏళ్ల తరబడి కనీస మరమ్మతులకు నోచుకోలేదు. ఎక్కడికక్కడ రోడ్డు పాడై గుంతలమయంగా మారింది.. ఇటీవల కురిసిన వర్షానికి గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తిత్లీ తుపాను సమయంలో పాడైనా ఇంత వరకు పట్టించుకోలేదు.. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ జేఈ విక్రమ్‌ను వివరణ కోరగా రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.  

న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని