రైతుకు లేదు మామిడి తీపి..!
మధుర ఫలం... ఏటా వేసవిలో అందుబాటులోకొచ్చే మామిడి పండ్లు రుచి చూడాలని సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ, పిల్లల నుంచి పెద్దల వరకు తాపత్రయ పడతారు.
జిల్లాలో సగానికి పైగా తగ్గిన దిగుబడి
ధర ఉన్నా పంట లేక నష్టం
విక్రయానికి సిద్ధం చేస్తున్న మామిడి పండ్లు
మధుర ఫలం... ఏటా వేసవిలో అందుబాటులోకొచ్చే మామిడి పండ్లు రుచి చూడాలని సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ, పిల్లల నుంచి పెద్దల వరకు తాపత్రయ పడతారు.. ఈ ఏడాది దిగుబడులు తగ్గిపోవడంతో సామాన్యునికి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో గతేడాది అధిక దిగుబడుల వల్ల మామిడి ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి ఆశించినంత ధర ఉన్నా దిగుబడుల్లేక నిరాశ చెందుతున్నారు.. పంట దిగుబడి పెరిగినా, తగ్గినా నష్టమే చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గతేడాది మార్కెట్లో పోగులుగా ఉన్న మామిడి ఈసారి అంతగా కనిపించని పరిస్థితి నెలకొంది..
న్యూస్టుడే, రణస్థలం
- జిల్లాలో 5,315 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అధికంగా రణస్థలం, జి.సిగడాం, జలుమూరు, సారవకోట, పోలాకి, పొందూరు మండలాల్లో పంట విస్తీర్ణం ఉంది.. మెట్ట ప్రాంతమైన ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే తోటలు అధికంగా ఉన్నాయి.
మామిడి కాయలను దించుతున్న రైతులు
ఎకరాకు రూ. 25 వేల ఖర్చు..
కొన్నిచోట్ల స్థానిక రైతులే సాగు చేసుకుంటుండగా మరికొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగేళ్ల కాలానికి వ్యాపారులకు, ఇతర జిల్లాల రైతులకు లీజుకిచ్చేస్తున్నారు. వందల ఎకరాలను ఒప్పంద ప్రాతిపతికన రైతులు తీసుకుంటారు. ఇందులో భాగంగా నష్టాలతో సంబంధం లేకుండా ముందుగానే కొంత సొమ్ము సంబంధిత రైతుకి ఇస్తారు. గతేడాది అధిక దిగుబడులతో కుదేలవ్వగా ఈ ఏడాది దిగుబడులు తగ్గిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. లీజు రైతులు, తోటల యజమానులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లిస్తారు. తోటల్లో దుక్కులు, ఎరువులు, పురుగుమందులు ఇతర సాగు ఖర్చులు కలిపి ఏడాదికి రూ.25 వేలు వరకు ఖర్చు పెడుతుంటారు.
- గతేడాది జిల్లాలో సగటున దిగుబడి అంచనా 14,868 మెట్రిక్ టన్నులు కాగా ఈసారి ఎనిమిది నుంచి తొమ్మిది వేల టన్నులేనని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఎకరాకు సరాసరి 2-3 టన్నుల దిగుబడి రాగా ఇప్పుడు అర టన్ను నుంచి టన్ను మాత్రమే వస్తుందని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం టన్ను ధర రూ.5 వేల నుంచి రూ.10 వేలు పలుకగా ప్రస్తుతం గరిష్ఠంగా రూ.30 వేలు పలుకుతోంది.
- జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు సరకు వెళ్లేది. మన జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
సాగు తగ్గించేశాను..
గతేడాది 140 ఎకరాలు లీజుకు తీసుకొని సాగు చేశాను. తీవ్రంగా నష్టపోవడంతో ఈసారి 50 ఎకరాలు మాత్రమే తీసుకున్నాను. ఎకరాకు లీజుతో కలిసి రూ.25 వేలు ఖర్చవుతుంది. ఇప్పుడు ధర పలుకుతున్నా దిగుబడి తగ్గిపోవడంతో మళ్లీ నష్టాలు పాలవ్వాల్సి వస్తుంది. గతంలో రోజుకు పది మంది కాయలు కోసేవారు. ఇప్పుడు ఐదుగురే పని చేస్తున్నారు.
లంక రమణ, రైతు
ఆశాజనకంగా లేదు..
గతంతో పోలిస్తే దిగుబడి తక్కువగా ఉంది. పంట తీయక తోటల్లోనే వదిలేశాం. కనీసం రవాణా ఖర్చులు కూడా రాలేదు. ఈసారి ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి రాలేదు. నేను 70 ఎకరాల్లో పంట సాగు చేశాను.
మీసాల రమేష్, రైతు, దేవరాపల్లి
ప్రతికూల వాతావరణం వల్లే..
ఈ ఏడాది మామిడికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. పూత సమయానికి విపరీతమైన మంచు కురవడంతో మాడిపోయింది. మామిడిలో ప్రత్యామ్నాయ మార్పులు ఉంటాయి. ఒక ఏడాది విరివిగా దిగుబడి వస్తే, మరుసటి ఏడాది తగ్గిపోతుంది. పూతకు రసం పీల్చే పురుగు ఆశించడం వల్ల పంట ఆశాజనకంగా లేదు.
రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి