ఎవరు అడ్డొచ్చినా ఆపేదేలే..!
మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారం ఉంటుందో.. లేదోననే ఆలోచనతో వైకాపా నాయకులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా చెలరేగిపోతున్నారు.
షేర్మహ్మద్పురంలో అధికారుల ఆదేశాలు బేఖాతరు
హెచ్చరించినా పట్టించుకోని వైకాపా నేతలు
గురుకుల పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్న ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు, అధికారులు
ఎచ్చెర్ల, న్యూస్టుడే: మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికారం ఉంటుందో.. లేదోననే ఆలోచనతో వైకాపా నాయకులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల ఆదేశాలను సైతం లెక్క చేయకుండా చెలరేగిపోతున్నారు. ఎచ్చెర్ల మండలం షేర్మహ్మద్పురం గ్రామంలో ఏపీ గురుకుల పాఠశాలకు కేటాయించిన స్థలంలో మూడు నెలల నుంచి సాగుతున్న అక్రమ నిర్మాణానికి అడ్డుకట్ట పడటం లేదు.
గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1985లో 635/2 సర్వే నంబరులో 40 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలానికి ఎలాంటి కంచె లేకపోవటంతో దానిపై అక్రమార్కుల కన్నుపడింది. ఆ ప్రాంతంలో వైకాపా సర్పంచి అనుచరులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు రెవెన్యూ, పోలీసులకు అప్పట్లోనే రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేసి అది పాఠశాలకు చెందిన స్థలంగా గుర్తించి పనులు ఆపాలని ఆదేశించారు. అయినా ఆక్రమణ దారుడు లెక్క చేయకుండా మూడు నెలలుగా అధికార అండతో సెలవు రోజుల్లో, అధికారులు లేని సమయాల్లో అదును చూసి పనులు చేపడుతూ పునాదాల స్థాయి దాటేశాడు. నేడో రేపో స్లాబ్ సైతం వేసేందుకు సిద్ధమవుతున్నాడు.
మరోసారి సర్వే..
తాజాగా గ్రామానికి చెందిన తెదేపా మాజీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి ఆర్డీవోకు ఏపీ గురుకుల సొసైటీ స్థలం కబ్జాకు గురవుతోందని, పరిరక్షించాలని ఫిర్యాదు చేశారు. ఆర్డీవో ఆదేశాల మేరకు తహసీల్దార్ వి.శ్యామ్కుమార్ పోలీసులు సమక్షంలో రెవెన్యూ సిబ్బందితో శనివారం మరోసారి సర్వే చేయించి నివేదిక కోరారు. మండల సర్వేయర్ సుభాష్, ఆర్ఐ మధుప్రియ, వీఆర్వో పాలవలస శ్రీనివాసరావు, పలువురు సర్వేయర్లు మరోసారి సర్వే చేసి గురుకుల పాఠశాలకు చెందిన స్థలాన్నే ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదికను అందించనున్నారు.
యంత్రాంగం తీరుపై విమర్శలు..
మూడు నెలల నుంచి పనులు ఆపాలని చెబుతున్నా పట్టించుకోకుండా దౌర్జన్యంగా నిర్మాణం చేపడుతుంటే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చౌద్యం చూస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులతో పాటు, పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు అడ్డుకొని అక్రమ నిర్మాణం ఆపాలని, లేనిపక్షంలో రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి