ఇంజినీరింగ్ విభాగంలో.. ఇంటి దొంగలు!
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేందుకు పలాస- కాశీబుగ్గ పురపాలికలో జరిగిన ఘటనే ఉదాహరణ.. ఇక్కడ ఇంజినీరింగ్ శాఖలో కొందరు సిబ్బంది బోర్ల విడిభాగాలను వీధుల్లో వేస్తామని తీసుకెళ్లి దుకాణాలల్లో విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
గుట్టుగా బోర్ల విడిభాగాలు తరలింపు
దుకాణంలోని పైపుల మధ్య దాచిన చేతిబోరు భాగాలు
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేందుకు పలాస- కాశీబుగ్గ పురపాలికలో జరిగిన ఘటనే ఉదాహరణ.. ఇక్కడ ఇంజినీరింగ్ శాఖలో కొందరు సిబ్బంది బోర్ల విడిభాగాలను వీధుల్లో వేస్తామని తీసుకెళ్లి దుకాణాలల్లో విక్రయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలకు ప్రయత్నిస్తున్నా కిందిస్థాయి ఉద్యోగులు అడ్డుకుంటూ చక్రం తిప్పుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
న్యూస్టుడే, పలాస: పలాస పురపాలక సంఘంలోని ఇంజినీరింగ్ విభాగంలో కొనుగోలు చేసే చేతిపంపులు, సిలిండర్లు, పైపులు, హెడ్లను టెండర్లు లేదా నామినేషన్ పద్ధతుల్లో రప్పిస్తుంటారు. ఇండెంట్ ప్రకారం వచ్చిన సామగ్రి పురపాలక సంఘం కమిషనర్, డీఈఈ, ఏఈ, ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో లెక్క పెట్టి దస్త్రాల్లో నమోదు చేయాలి. ఆయా వార్డుల్లో అవసరం మేరకు సిబ్బంది ఇండెంట్ పెడితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారి దగ్గరుండి సామగ్రి లెక్కపెట్టి అప్పగించాలి. పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో సిబ్బంది చేతికే స్టోర్రూం తాళాలు ఇచ్చేస్తుండటంతో సామగ్రికి రెక్కలొస్తున్నాయి. కొంతమంది విడిభాగాలను పక్కదారి పట్టించి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇటీవల పురపాలక సంఘంలో ప్రజావసరాల మేరకు సుమారు రూ.8 లక్షల విలువైన మోటార్లు, పైపులు, ఇతర విడిభాగాలను కొనుగోలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారులు నిమగ్నమై ఉండగా.. 3 చేతిపంపు సిలిండర్లు, 5హెడ్లు పక్కదారి పట్టాయి. ఇవి పలాస కె.టి.రోడ్డులో ఉన్న ఓ దుకాణానికి చేరాయి. జాతీయ రహదారి సమీపంలో ఉన్న నాలుగో బావికి చెందిన కేబుల్ తీగలను కత్తిరించి పట్టుకుపోయారు. అధికారులకు తెలియటంతో విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు.
పలాసలోని ఓ దుకాణంలో ఉన్న బోరు సిలిండర్లు
సిబ్బంది చేతివాటం..
ఇంజినీరింగ్ శాఖలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది చేతివాటం చూపుతున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఇటీవల కొత్త డీఈ రాగా, మరో ఏఈ శ్రీకాకుళం నుంచి డెప్యుటేషన్పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. న్యూకాలనీ, బత్తుల వీధి, పద్మనాభపురం వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ సహాయకులను పురపాలిక సంఘ కార్యాలయానికి కమిషనర్ రప్పించారు. వీరికి విద్యుత్తు, నీటి సరఫరా, పట్టణ పరిధిలోని సివిల్ పనులపై పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. వార్డుల్లో వీరు పనుల నిర్వహణను చూస్తూనే.. వాటికి అవసరమయ్యే సామగ్రిని స్టోర్ రూంలో తనిఖీ చేసి అప్పగించాలి. అయితే సిబ్బందికే నేరుగా తాళాలు అప్పగించడం, బాధ్యతగా పర్యవేక్షించకపోవడంతో గుట్టుగా సామగ్రి బయటకు వెళ్లిపోతోంది. బోర్ల విడిభాగాలు పక్కదారి పట్టడం, ఓ దుకాణంలో విక్రయించడంతో ఆ దుకాణదారునితో మాట్లాడి వాటిని వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది.
నా దృష్టికి వచ్చింది..
బోరు సామగ్రి తరలించారనే విషయం నా దృష్టికి వచ్చింది. సిబ్బందిని పిలిపించి విచారణ చేపట్టాం. దుకాణం నుంచి సామగ్రి అరువు తీసుకొచ్చామని, పురపాలక సంఘానికి సామగ్రి వచ్చిన తర్వాత వాటిని దుకాణానికి ఇచ్చేశామని చెప్పారు. తప్పు జరిగితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. స్టోర్ రూం తాళాలు ఏఈకి అప్పగించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.
పురపాలక కమిషనర్ టి.నాగేంద్రకుమార్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు