15 ఏళ్ల తర్వాత జిల్లాలో క్రికెట్ పోటీలు
సుదీర్ఘ విరామం అనంతరం అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు జిల్లాలో జరగనున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ పోటీలకు టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఆతిథ్యం ఇవ్వనుంది.
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఐతమ్ వేదికగా అండర్-19, 23 నార్త్జోన్ మ్యాచ్లు
మైదానాన్ని పరిశీలిస్తున్న జిల్లా క్రికెట్ సంఘ ప్రతినిధులు
న్యూస్టుడే, టెక్కలి : సుదీర్ఘ విరామం అనంతరం అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు జిల్లాలో జరగనున్నాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ పోటీలకు టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 31 నుంచి అండర్- 19 నార్త్ జోన్, జూన్ 15 నుంచి అండర్-23 నార్త్జోన్ వన్డే పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు శనివారం జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి హసన్రాజాషేక్, కోశాధికారి సైలానీ, మెంటార్ ఇలియాస్ అహ్మద్, సెలక్టర్ ఆర్.సి.రెడ్డి మైదానాన్ని పరిశీలించారు. ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. టోర్నమెంట్ కన్వీనరుగా ఎన్.లాల్ బహదూర్ వ్యవహరిస్తారని చెప్పారు.
అండర్- 19 జిల్లా జట్టు ఇదే..
నార్త్జోన్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును సంఘ ప్రతినిధులు ప్రకటించారు. వి.ప్రద్నీష్సాయి(కెప్టెన్), ఎన్.సుశాంత్, సిద్దు విఘ్నేష్, జయరాం, గోపాలకృష్ణ, ఎన్.రాజ్కుమార్, సాయిసుజన్, పూర్ణచంద్ర, జున్నారావు, ఎం.రోహిత్, థామస్ రామ్కుమార్, నవీన్ కుమార్రెడ్డి, కల్యాణ్కుమార్, వినీల్సాగర్, అభయ్, డి.సిద్ధు.
స్టాండ్బైస్ : వి.కృష్ణ, వి.మోహనరావు, అభినయ్, వినయ్చంద్ర, పూజారి దానిష్, భరత్కుమార్ ఎంపికయ్యారు. జట్టు కోచ్, మేనేజరుగా మేఘనాథ్, నార్త్జోన్ సెలక్టర్గా బొడ్డేపల్లి వర్ధన్ వ్యవహరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం