కాలువ కప్పేసి..స్థలాలగా మార్చేసి..!
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధి వరద నీటి కాలువ అక్రమణదారుల పాలవుతోంది.
వంద గజాలు రూ.5 లక్షలకు విక్రయం
కాలువ స్థలాన్ని ఇలా ప్లాట్లుగా మార్చేస్తున్నారు..
న్యూస్టుడే, కాశీబుగ్గ
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధి వరద నీటి కాలువ అక్రమణదారుల పాలవుతోంది. కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలు తయారు చేసి తాజాగా రూ.1.50 కోట్ల విలువ చేసే కాలువను ఆక్రమించుకుని ఇంటి స్థలాలుగా మార్చేసి ఏకంగా విక్రయాలకు తెరతీశారు.
నాటి పట్టాలు కాదని..
సూదికొండ, నెమలికొండల నుంచి వచ్చే వరద నీరు ఈ కాలువ గుండా దిగువ భాగానికి వెళ్లాల్సి ఉంది. అందుకు సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలోని ఈ కాలువ ఎర్ర చెరువు వరకు ఉండేది. గతంలో నాలుగు ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైంది. మిగిలిన సుమారు ఎకరానూ తాజాగా ఇంటి స్థలాలుగా మార్చేసి కొందరు అమ్మేస్తున్నారు.
తహసీల్దారే స్వయంగా కేసు పెట్టినా...
ఈ కాలువ భాగంలో 2001లో పలువురికి అప్పటి రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాలకు పట్టాలు మంజూరు చేశారు. కాగా మిగిలిన భాగానికి కొంతమంది డీ పట్టాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని 2012-2013లో అప్పటి తహసీల్దారు పార్వతీశం పోలీస్ కేసులు సైతం పెట్టారు. తదనంతర కాలంలో అధికారులు దాన్ని పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరోసారి విక్రయాలకు పాల్పడుతున్నారు. వంద గజాల చొప్పున ఇంటి స్థలాలుగా మార్చి ఒక్కోటి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. గతంలో ఇంటి స్థలాలకు పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రస్తుతం కనిపించకుండా పోవడం కూడా వీరికి కలిసొచ్చింది. ఇప్పటికే 20 సెంట్లకుపైగా విక్రయించేసినట్టు తెలుస్తోంది.
పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్
కాలువలో చేపడుతున్న అక్రమ విక్రయాలకు పక్కనున్న జిరాయితీ సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్లు కూడా చేయించేస్తున్నారు. ఈ ప్రాంతంలో వంద గజాల జిరాయితీ స్థలం రూ.10 లక్షలు వరకు ధర ఉంది. కాలువ ప్రాంత స్థలం కావడంతో అందులో సగానికి అంటే రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు.
మా దృష్టికి రాలేదు
కాలువ ప్రాంతంలో ఇటీవల విక్రయాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇటువంటి స్థలాలను ఎవరూ కొనుగోలు చేయవద్దు. కొంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఎల్.మధుసూదన్, తహసీల్దార్, పలాస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల