అత్యాశ మానుకో.. మోసం తెలుసుకో
‘నేను ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండను. నాలో ఆశాభావం ఎక్కువ. డబ్బులు సంపాదించే దారుల కోసం శోధిస్తుంటా. కష్టపడకుండా డబ్బులొస్తాయంటే ముందూ.. వెనుకా చూడకుండా అడిగిన సమాచారం ఇచ్చేస్తా.
సైబర్ కేటుగాళ్ల వలలో యువత
న్యూస్టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం, కాశీబుగ్గ
‘నేను ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండను. నాలో ఆశాభావం ఎక్కువ. డబ్బులు సంపాదించే దారుల కోసం శోధిస్తుంటా. కష్టపడకుండా డబ్బులొస్తాయంటే ముందూ.. వెనుకా చూడకుండా అడిగిన సమాచారం ఇచ్చేస్తా. తీరా అత్యాశకు పోయి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి మోసపోతుంటా..’ ఇదీ సగటు జీవుల ప్రస్తుత పరిస్థితి. ప్రతిరోజు చుట్టుపక్కలే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావట్లేదు. పెరిగిన సాంకేతికత ఓ వైపు ప్రజలకు సులభతర సేవలందిస్తూనే.. మరోవైపు సైబర్ కేటుగాళ్ల మోసాలకు తావిస్తోంది. జిల్లాలో ఇలా ఏటా అనేక మంది బాధితులుగా మారుతూ.. రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు.
కొన్ని ఉదాహరణలు ఇలా..
- శ్రీకాకుళం నగరం ప్రధాన రహదారికి చెందిన ఓ యువతి తన చరవాణికి లోన్ పేరిట ఓ లింక్ వచ్చింది. అది ఓపెన్ చేసి అడిగిన వివరాలను నమోదు చేయడంతో వెంటనే ఖాతాలో డబ్బులు జమ చేశారు. అనంతరం మొత్తం నగదు చెల్లించినప్పటికీ, ఇంకా ఇవ్వాలని వేధించారు. లేదంటే నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.
- ఎచ్చెర్లకు చెందిన ఓ వ్యక్తికి తెలియని నంబరుతో ఫోన్ వచ్చింది. మీ పేరిట ఆర్డర్ వచ్చిందని, ఓటీపీ చెప్పమన్నారు. తానేమీ ఆర్డర్ చేయలేదని చెప్పినప్పటికీ.. ఎవరో మీ నంబరు ఇచ్చారని ఓటీపీ చెబితే వస్తువు మీకు అందజేస్తామని నమ్మించారు. తీరా ఓటీపీ చెప్పాక బాధితుడి ఖాతాలో డబ్బులను లూటీ చేశారు.
- నరసన్నపేటకు చెందిన ఓ రైతు అవగాహన రాహిత్యంతో చరవాణిలో ఓ నకిలీ యాప్పై క్లిక్ చేశారు. దీంతో అది ఇన్స్టాల్ అయ్యింది. తన వ్యక్తిగత సమాచారం గుర్తుతెలియని వ్యక్తులకు వెళ్లిపోయింది. అనంతరం సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.
- శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువకుడికి కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘మీకు లాటరీ తగిలిందని, కొంత మొత్తం చెల్లిస్తే ఆ డబ్బులు పంపిస్తామని, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పమన్నారు. ఆశపడిన యువకుడు వివరాలు చెప్పగా.. క్షణాల్లో ఖాతాలో డబ్బులు మాయం చేశారు.
- నరసన్నపేటకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ల ద్వారా అతడికి కొన్ని సమాచారాలొచ్చాయి. డిపాజిట్కు రెట్టింపు నగదు ఇస్తామని సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. బాధితుడు తొలుత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగా రెట్టింపు డబ్బులు వేశారు. పెద్దమొత్తంలో వేస్తామని నమ్మించి రూ.9 లక్షలు కాజేశారు.
ఫిర్యాదు చేయడంలో అలసత్వం వద్దు..
లాటరీలు, రుణాలు, ఆఫర్లు, ఆన్లైన్ ట్రేడింగ్ ఇలా అనేక రూపాల్లో సైబర్ కేటుగాళ్లు ఎర వేస్తుంటారు. చరవాణులకు సందేశాలు, లింక్లు పంపించి వ్యక్తిగత సమాచారం తీసుకుంటారు. ఇలా ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బులు మాయం చేస్తారు. మోసపోయామని గుర్తించిన వెంటనే 1930 నంబరుకు డయల్ చేసి ఫిర్యాదు చేయాలి. అనంతరం దగ్గర్లోని సైబర్ క్రైం విభాగానికి వెళ్లి సమాచారం ఇవ్వాలి. ఆలస్యం చేస్తే డబ్బుల్ని వివిధ ఖాతాల్లోకి మార్చేసే అవకాశం ఉంది. రికవరీ చేసేందుకు సైతం కష్టమవుతుంది. జిల్లాలో పోలీసు కార్యాలయంలో వీటికి సంబంధించి ప్రత్యేకంగా సైబర్ నేరాల విభాగం ఉంది. అందులో ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారు. జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులను వారు సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేస్తారు.
యాప్లపై అప్రమత్తంగా ఉండాలి..
- టి.పి.విఠలేశ్వర్, క్రైం విభాగం, ఏఎస్పీ, శ్రీకాకుళం
ఆన్లైన్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలి. సైబర్ వలలో చిక్కుకుంటే అధిక మొత్తంలో నగదును కోల్పోతాం. అవసరం లేని చోట వ్యక్తిగత వివరాలను పొందుపరచకూడదు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండటంతో ఆధార్ సంఖ్య ఓటీపీ చెప్పడంతో ఖాతా ఖాళీ చేసేస్తారు.
జిల్లాలో సైబర్ నేరాల వివరాలిలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్