కడగండి.. పూర్తి చేసేదెప్పుడండి..?
పదిహేనేళ్ల కిందట ఎల్ఎన్పేట మండలంలో కడగండి జలాశయాన్ని నిర్మించారు. సుమారు రూ.5 కోట్లు వరకు నిధులు ఖర్చు చేశారు. కానీ దానికి అనుసంధానంగా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో అందుబాటులోకి రాలేదు.
15 ఏళ్లుగా ముందుకు సాగని కాలువల నిర్మాణం
న్యూస్టుడే, ఎల్ఎన్పేట
పదిహేనేళ్ల కిందట ఎల్ఎన్పేట మండలంలో కడగండి జలాశయాన్ని నిర్మించారు. సుమారు రూ.5 కోట్లు వరకు నిధులు ఖర్చు చేశారు. కానీ దానికి అనుసంధానంగా కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా రిజర్వాయరులో సాగునీరు ఉన్నా రైతులకు అక్కరకు రావట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ పనులకు మోక్షం కలగడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల నిర్మాణానికి ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి జలశయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
ఎల్ఎన్పేట మండలంలోని జంబాడ వద్ద 2005లో కడగండిగెడ్డ జలాశయం నిర్మాణానికి అప్పటి ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి శంకుస్థాపన చేశారు. రెండు కొండల మధ్య గట్టు నిర్మాణం, కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన తూములు పనులు రెండేళ్లులో పూర్తి చేశారు. ఆ తరువాత కుడి, ఎడమ కాలువల నిర్మాణం ఏళ్ల పాటు నిలిచిపోయింది.
2016లో కాలువల నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.4.06 కోట్లు మంజూరు చేసింది. వాటితో భూసేకరణ చేశారు. కానీ చాలా మంది రైతు ఖాతాల్లో పరిహారం జమ కాలేదు. ఎడమ కాలువ వద్ద చేపట్టిన వయోడెక్ట్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన పనుల సంగతి పట్టించుకోలేదు.
రెండు మండలాలకు ప్రయోజనం..
కడగండి జలాశయం పూర్తయితే ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి మండలాల్లోని పలు గ్రామాలు ప్రయోజనం కలుగుతుంది. ఎడమ కాలువ అందుబాటులోకి వస్తే ఎల్ఎన్పేట మండలంలోని వలసపాడు, బొర్రంపేట, జంబాడ, ముంగెన్నపాడు, కరకవలస, మల్లికార్జునపురం, శ్యామలాపురం, కుసుమలపాడు గ్రామాలు, కుడి కాలువ పూర్తయితే ఎల్ఎన్పేట మండలంలో జంబాడ, సరుబుజ్జిలి మండలంలో అమృత లింగానగరం, గోనెపాడు, బప్పడాం, కూనజమ్మన్నపేట, సరుబుజ్జిలి గ్రామాలకు సాగునీటి కష్టాలు తీరుతాయి. కానీ పనులు జరగకపోవడంతో ప్రస్తుతం జలాశయంలోని నీరు వృథాగా పోతోంది. తూములు సైతం మరమ్మతులకు గురయ్యాయి.
ఉన్నతాధికారులకు తెలియజేశాం...
- జనార్ధనరావు, డీఈఈ, జలవనరులశాఖ, శ్రీకాకుళం
కాలువల నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న గుత్తేదారు 38 శాతం పనులు చేశారు. ఆ తరువాత పనులు ఆపేశారు. దీంతో ఆయనకు నోటీసులిచ్చినా స్పందించ లేదు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. తూముల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం