logo

గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

గంజాయి తరలిస్తున్న ముగ్గురిని కాశీబుగ్గలో మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై పారినాయుడు తెలిపారు.

Published : 28 Feb 2024 03:50 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని కాశీబుగ్గలో మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై పారినాయుడు తెలిపారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రమేష్‌ నాయక్‌, రాయగడ జిల్లాకు చెందిన ఇస్మాల్‌ గంట, ఆర్‌.ఉదయ్‌గిరికి చెందిన ప్రసాద్‌ కరాడ్‌ గంజాయిని సంచుల్లో భద్రపరచి తమిళనాడు తరలించాలని పథకం వేశారు. రైలులో అక్కడికి వెళ్లడానికి కాశీబుగ్గ వచ్చారు. అనుమానాస్పద స్థితిలో ఉండగా వారి  సంచులను తనిఖీ చేయడంతో 15 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు తేలింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని