logo

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండల కేంద్రమైన సీకేదిన్నె గ్రామంలో జిల్లాకు చెందిన బి.లావణ్య (20) అనే వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Published : 28 Feb 2024 03:54 IST

లావణ్య

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండల కేంద్రమైన సీకేదిన్నె గ్రామంలో జిల్లాకు చెందిన బి.లావణ్య (20) అనే వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కవిటి మండలం ఇద్దివానిపాలేనికి చెందిన లావణ్యకు గాలివీడు మండలం వడిసే లంకపల్లె గ్రామానికి చెందిన గణేష్‌రెడ్డితో నెల రోజుల కిందట వివాహం జరిగింది. దంపతులిద్దరూ సీకేదిన్నె గ్రామంలోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం లావణ్య ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని