మహిళ దారుణ హత్య
ఒడిశా రాష్ట్రం పర్లాఖెముండి సమీపంలోని పాటికోట గ్రామానికి చెందిన శాసనం ఆరుద్ర (35) సారవకోట మండలం నౌతళ సమీపంలో హత్యకు గురైంది. పాతపట్నం సీఐ ఎన్.సాయి, సారవకోట ఎస్సై జి.అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వివాహేతర సంబంధమే కారణం!
ఆరుద్ర (పాత చిత్రం)
సారవకోట, పాతపట్నం, న్యూస్టుడే: ఒడిశా రాష్ట్రం పర్లాఖెముండి సమీపంలోని పాటికోట గ్రామానికి చెందిన శాసనం ఆరుద్ర (35) సారవకోట మండలం నౌతళ సమీపంలో హత్యకు గురైంది. పాతపట్నం సీఐ ఎన్.సాయి, సారవకోట ఎస్సై జి.అప్పారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కలి మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆరుద్రకు పాటికోటకు చెందిన సోమేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరుద్ర కూరగాయల వ్యాపారం చేస్తోంది. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఈ నెల 23న రంగాపురం వచ్చి.. అదే రోజు తిరుగు ప్రయాణమైంది. ఆమెను సోదరుడు లోకేశ్వరరావు తెంబూరులో ఆర్టీసీ బస్సు ఎక్కించి వెళ్లిపోయాడు. పాతపట్నం వచ్చిన ఆమె కూరగాయల వ్యాపారం వల్ల పరిచయమైన ఒడిశా రాష్ట్రం గుసాని బ్లాక్ కంట్రగడకు చెందిన ఆటో డ్రైవర్ ఊడు పాపారావును కలిసింది. ఇద్దరూ ఆటోలో పాతపట్నం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని నౌతళ ఘాట్కు సమీపంలోని తోటకు వెళ్లి ఏకాంతంగా గడిపారు. భర్త వద్దకు వెళ్లనని, తనతోనే తీసుకెళ్లాలని ఆరుద్ర కోరగా పాపారావు నిరాకరించాడు. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తీసుకెళ్లడం కుదరదని తేల్చి చెప్పాడు. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. ఆరుద్ర కింద పడటంతో తలకు రాయి తగిలి గాయమైంది. అనంతరం పాపారావు అక్కడే ఉన్న రాయితో తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం నిందితుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఘటన జాతీయ రహదారికి సుమారు 70 మీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ బాలచంద్రారెడ్డి, తదితరులు
కాల్డేటా ఆధారంగా నిందితుడి గుర్తింపు..
ఈనెల 23న బస్సు ఎక్కిన ఆరుద్ర పాటికోట చేరలేదని తెలుసుకున్న తమ్ముడు లోకేశ్వరరావు పాతపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు 24న అదృశ్యం కేసు నమోదు చేశారు. కాల్డేటా ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఏడు నెలలుగా పాపారావుతో మాట్లాడుతున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని ఘటనా స్థలానికి మంగళవారం తీసుకొచ్చారు. పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న ఆరుద్ర మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా పంచనామా నిర్వహించి, పాతపట్నంలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయాన్ని తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, పాతపట్నం, నరసన్నపేట సీఐలు ఎన్.సాయి, ప్రసాదరావు, పాతపట్నం, సారవకోట ఎస్సైలు మహమ్మద్ యాసిన్, జి.అప్పారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పాతపట్నం సీఐ ఎన్.సాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం