డిజిడల్ గ్రంథాలయాలు..!
గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.
ఏళ్లు గడిచినా అందుబాటులోకి రాని నిర్మాణాలు
న్యూస్టుడే, పొందూరు, కొత్తూరు, పోలాకి
సరుబుజ్జిలి: షళంత్రిలో డిజిటల్ గ్రంథాలయానికి కేటాయించిన స్థలం
గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూస్తామని వారిలో ఆశ రేకెత్తించారు. స్థలాలు కూడా ఎంపిక చేశామని, నిర్మాణాలు పూర్తి చేసేస్తామని ఊరూరా ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ ఒక్క భవనం కూడా అందుబాటులోకి రాలేదు. నిధుల కొరతతో చాలా చోట్ల ప్రగతి పడకేసింది.
జిల్లాలోని ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో 195 డిజిటల్ గ్రంథాలయాలను మంజూరు చేశారు. ఉపాధి హామీ నిధులు రూ.16 లక్షలు చొప్పున కేటాయించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థలం విషయంలోనూ 690 చదరపు అడుగుల్లో నిర్మించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలంలో నాలుగు నుంచి తొమ్మిది వరకు భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. అందులో ఒక్కటీ పూర్తి కాలేదు. 22 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల స్థలాల కేటాయింపులో జాప్యంతో పాటు గుత్తేదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
కొన్నిచోట్ల ఇంకా వెతుకులాటే..
తొలి విడతలో జిల్లావ్యాప్తంగా 120 భవనాల కోసం స్థలాలు గుర్తించారు. మిగిలిన చోట్ల కూడా వెతుకులాట కొనసాగుతోంది. వాస్తవానికి ఈ పనులు గతేడాది డిసెంబరు నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉన్నా.. అది జరగలేదు. స్థలాలు ఉన్నచోట కూడా పనులు చేసేందుకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. వీటి ద్వారా వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, కంప్యూటర్లు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అన్ని సదుపాయాలు సమకూరుతాయనుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది.
చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని వివిధ దశల్లో ఆగాయి. గుత్తేదారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం.
వి.ఎస్.ఎన్.మూర్తి, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే