కోతలతో ‘ఏడు’పిస్తున్నారు...!
త్రీఫేజ్ పంపుసెట్లకు 400 వాట్స్ సరఫరా అవసరం. లోవోల్టేజీ కారణంగా 300 వాట్స్ రావడంతో మోటార్ల నుంచి నీరు రావడం తగ్గిపోయి తరచూ అవి మరమ్మతులకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్తు సరఫరా
ఎండుతున్న రబీ పంటలు
న్యూస్టుడే, రణస్థలం గ్రామీణం, ఎచ్చెర్ల, గుజరాతీపేట(శ్రీకాకుళం), లావేరు
లావేరులో ఎండుతున్న మొక్కజొన్న పంట
త్రీఫేజ్ పంపుసెట్లకు 400 వాట్స్ సరఫరా అవసరం. లోవోల్టేజీ కారణంగా 300 వాట్స్ రావడంతో మోటార్ల నుంచి నీరు రావడం తగ్గిపోయి తరచూ అవి మరమ్మతులకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండ తీవ్రత పెరగడం.. మరోవైపు విద్యుత్తు కోతలు ప్రారంభమవ్వడంతో అన్నదాతలు సతమతమవుతున్నారు. రబీలో వేసిన మొక్కజొన్న, కూరగాయలు, అరటి, పుచ్చ, టమాట, చెరకు, రాగులు, బొప్పాయి, అపరాలు, మిరప, వేరుశనగ తదితర పంటలకు పూర్తిస్థాయిలో నీరందక ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఇస్తామని చెప్పి ఏడు గంటలకు కుదించేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదేనా అన్నదాతలకు ఇచ్చే భరోసా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
రణస్థలం సబ్ డివిజన్ పరిధిలో 15,249 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. రబీలో అన్నిరకాల పంటలు కలిపి సుమారు 12 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సకాలంలో సాగునీరు అందించకపోవడంతో ఎండిపోతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే చేతులెత్తేస్తున్నారు. త్రీఫేజ్ సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయ పంపు సెట్లు: 29,953
రోజుకు విద్యుత్తు వినియోగం: రెండు లక్షల యూనిట్లు
ఎప్పుడిస్తారో తెలియడం లేదు..
ఏడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. సకాలంలో సాగునీరు అందక పంట సగానికి పైగా దెబ్బతింది. కోసే సమయానికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడు గంటలే కరెంట్ ఇస్తున్నారు. అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు.
ఇనపకుర్తి తోటయ్యదొర, కేశవరాయపురం, లావేరు మండలం
పవర్గ్రిడ్లో సాంకేతిక లోపంతోనే..
పవర్ గ్రిడ్లో సాంకేతిక లోపం తలెత్తితే వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో కొంత అంతరాయం కలుగుతోంది. ప్రత్యేకంగా కోతలు విధించడం లేదు.
నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఈ, శ్రీకాకుళం సర్కిల్, ఈపీడీసీఎల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.