ఇసుక పోగులు.. అక్రమాలకు సాక్ష్యాలు..!
అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇసుక రవాణాకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అనుమతులున్న ఇసుక రేవు ఒక్కటీ లేకపోయినప్పటికీ తవ్వకాలు జరిగిపోతున్నాయి.
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్
టెక్కలిలో వేసిన ఇసుక నిల్వలు
అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఇసుక రవాణాకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అనుమతులున్న ఇసుక రేవు ఒక్కటీ లేకపోయినప్పటికీ తవ్వకాలు జరిగిపోతున్నాయి. ఎవరైనా అడిగితే తమ వద్ద అనుమతులున్నాయని దబాయిస్తున్నారు. యంత్రాంగానికి విషయం తెలిసినా ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇసుక నిల్వ చేయట్లేదని, త్వరలో ఏర్పాటు చేస్తామని చెబుతుండటం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా గతంలో పురుషోత్తపురం, లుకలాం, ఆంబళ్లవలస, గోపాలపెంట, దొంపాక, పురుషోత్తపురం-2, వెంకటాపురం, ముద్దాడపేటల వద్ద రేవులు ఉన్నాయి. ఎన్జీటీ ఆదేశాల మేరకు వాటికి మాన్యువల్ పద్ధతిలో ఇసుక తవ్వేందుకు అధికారులు పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేశారు. 2023లో జరిగిన డీఎల్ఎస్ఏ సమావేశంలో మరో 5 చోట్ల(హయాతీనగరం, నివగాం, దూసి, బట్టేరు, బూరవల్లి) వద్ద రీచ్లను గుర్తించి కొత్తగా ఈసీలకు అర్జీ పెట్టారు. కానీ అనుమతులు రాలేదు. దీంతో పాటు కొత్తగా మడపాం, చేనువలస, ఉప్పరిపేట, కొబగాం-కామేశ్వరిపేట, దొంపాక, కిల్లిపాలెం, పర్లాం, ముద్దాడపేట, భైరి, పొన్నాం, నైర, అంధవరం ప్రాంతాల్లో రీచ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. వాటన్నింటికీ అనుమతులు వచ్చాక గుత్తేదారు సంస్థకు అప్పగిస్తామని కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ(డీఎల్ఎస్ఏ) సమావేశంలో మైనింగ్ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అనుమతులతో సంబంధం లేకుండా గుత్తేదారు సంస్థ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతోంది.
ఈ నిల్వలు ఎక్కడివి..?
కలెక్టరేట్లో ఈనెల 24న నిర్వహించిన డీఎల్ఎస్ఏ సమావేశంలో జిల్లాలో ఆరు (పలాస, టెక్కలి, నైర, చెవ్వాకులపేట, రామకృష్ణాపురం, కంచిలి) ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి వర్షాకాలంలో ఇసుక కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని గనుల శాఖ అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. రెండు వారాల కిందట నుంచి చెవ్వాకులపేట రేవు నుంచి తీసుకెళ్లిన ఇసుకను టెక్కలిలో నిల్వ చేస్తున్నారు. టెెక్కలి ఆర్టీసీ డిపో పక్కన ఉన్న నిల్వలే ఇందుకు సాక్ష్యం. కొత్తూరు మండలం అంగూరులో వంశధార నది గర్భం నుంచి పెద్దఎత్తున ఇసుకను తోడేసి గ్రామ సమీపంలో భారీగా నిల్వ ఉంచుతున్నారు. పలాస, రామకృష్ణాపురం, నైర ప్రాంతాల్లో ఇసుక నిల్వలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ నదిలో తవ్వకాలకు అనుమతులు ఉండవని ముందుగానే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వివరణ అడిగితే భూగర్జగనులు, రెవెన్యూశాఖ అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్