ఇది ‘ధర్మ’మేనా..?
సమయం లేదు మిత్రమా.. ఎన్నికల వేళ దగ్గరపడుతోంది.. దోచేయాలి.. అన్నట్లుగా ఉంది అధికార పార్టీ నేతల తీరు. జిల్లాలో వీరి ఆగడాలకు అదుపే లేకుండా పోతోంది.. ఇందుకు ఉదాహరణ గార మండలం తోణంగి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న దారుణమే..
డీపట్టా భూమిపై అధికార పార్టీ నేతల కన్ను
కట్టబెట్టేందుకు ఆగమేఘాలపై దస్త్రాలు సిద్ధం
ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం
తోణంగి రెవెన్యూ పరిధిలో భూమి ఇదే..
సమయం లేదు మిత్రమా.. ఎన్నికల వేళ దగ్గరపడుతోంది.. దోచేయాలి.. అన్నట్లుగా ఉంది అధికార పార్టీ నేతల తీరు. జిల్లాలో వీరి ఆగడాలకు అదుపే లేకుండా పోతోంది.. ఇందుకు ఉదాహరణ గార మండలం తోణంగి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న దారుణమే.. ఇక్కడ 4.30 ఎకరాల భూమి తెదేపాకు చెందిన ఓ మహిళ ఆధీనంలో ఉండేది. కానీ కొందరు వైకాపా నేతల కళ్లు ఈ భూమిపై పడ్డాయి. ఇంకేముంది జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి అండతో డీపట్టా భూమిని వైకాపా మద్దతుదారులకు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
1996-97లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎవరి స్వాధీనంలో ఉన్న భూమిని వారికే పట్టాలు రూపొందించి అప్పగించేలా చర్యలు చేపట్టి 1998లో అందజేసింది. ఇందులో తోణంగి గ్రామానికి చెందిన ఓ మహిళకు సర్వే నంబరు 172/1లో డీపట్టా భూమి ఇచ్చారు. ఎప్పుడో 25 ఏళ్ల కిందట ఇచ్చిన భూమి ఇప్పుడు అనర్హులకు డీపట్టా ఇచ్చారంటూ అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు గత నవంబరు 2న సంబంధిత పట్టాను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మండలం కావడంతో ఈ భూమి విలువ రూ.కోట్లలో పలుకుతోంది.
గ్రామసభలో వ్యతిరేకించినా..!
ఈనెల 26న తోణంగి పంచాయతీలో ఈ భూములకు సంబంధించి గ్రామసభ జరిగింది. దీనిలో ఏ1 నోటీసుపై దళితులు అభ్యంతరాన్ని లేవనెత్తారు. గ్రామానికి చెందిన 50 మందికి పైగా స్థానికులు భూములు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. అయినా దీనిని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. చిత్రమేమిటంటే గ్రామసభ తీర్మానాన్ని అదేరోజు కాకుండా అంతకుముందే నిర్వహించి తీర్మానం ఆమోదించిన పత్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం.
అర్హులైన దళితులు, బీసీలు ఉన్నా..
అర్హులు ఉన్నా వారిని కాదని అధికార పార్టీకి చెందిన వారికి అప్పగించడంతో వెనుకబడిన వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలమని ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నివాసముంటున్నామని, డీపట్టా భూములు ఇప్పించాలంటూ గ్రామానికి చెందిన దళితులు రెండుసార్లు కలెక్టర్, జేసీకి ‘స్పందన’లో విన్నవించుకున్నారు. గతేడాది నవంబరున కలెక్టర్ను సంప్రదించగా ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించిన తర్వాత మంజూరు చేస్తామని ఎండార్సుమెంట్ ఇచ్చారు.
రద్దు చేయించి కాజేయాలని..
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని దక్కించుకునేందుకు తోణంగి పంచాయతీకి చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి నలుగురు మహిళల పేరున పట్టాలు రూపొందించి కాజేసేందుకు పావులు కదిపారు. ఇందుకు సంబంధించి అసైన్డ్ కమిటీ ఆమోదానికి అధికారాన్ని ఉపయోగించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ఆదేశానుసారం డీపట్టా భూములు వైకాపా మద్దతుదారులకే కట్టబెట్టేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఎవరికీ ఇవ్వలేదు..
తోణంగిలో భూమి ఎవరికీ ఇవ్వలేదు. గ్రామసభ జరిగినా ఇందుకు సంబంధించిన పత్రాలు మా వరకు రాలేదు. గతంలో ఉన్నవారు భూమిని మరొకరికి విక్రయించారని చట్టపరంగా డీపట్టా రద్దు చేశారు. ఇప్పటివరకు ఎవరికీ మంజూరు చేయలేదు.
సీహెచ్.రంగయ్య, ఆర్డీవో శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యమైన విద్య వైద్యమే లక్ష్యం..!
[ 27-07-2024]
‘జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు, నాణ్యమైన విద్య అందేలా చూడటం, మత్స్యకారుల వలసలు నియంత్రించడం, దీర్ఘకాలంగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించాలని’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. -
అయ్యో.. బాహుదా!
[ 27-07-2024]
ఇచ్ఛాపురం ప్రాంతంలో ఏటా అన్నదాతలకు సాగునీటి పరీక్ష తప్పడం లేదు. బాహుదా నదిలో గతంలో ఆరు నెలలు నీరు ఉండేది కాదు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
[ 27-07-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
అసెంబ్లీలో ఎవ·రేమన్నారంటే..?
[ 27-07-2024]
అమరావతి సచివాలయంలో శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, డాక్టర్ బెందాళం అశోక్, నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడారు. -
ప్రతిభ చూపితే భవిత నవోదయమే..!
[ 27-07-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే జవహర్ నవదోయ విద్యాలయంలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. -
పలాసపురంలో అగ్నిప్రమాదం
[ 27-07-2024]
పలాసపురంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. జరిగిన ప్రమాదంలో సంక రామారావు, బి.బైరాగి, బెందాళం మధు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. -
చంద్రబాబుకు స్వాగతం
[ 27-07-2024]
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని దిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. -
సైనికుల సేవలు వెలకట్టలేనివి
[ 27-07-2024]
దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యం
[ 27-07-2024]
ప్రజాసంక్షేమం, పేదల అభ్యున్నతే జనసేన లక్ష్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. -
నిరుద్యోగులను మోసగించిన పంచాయతీ కార్యదర్శిపై విచారణ
[ 27-07-2024]
ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన మందస మండలం లొహరిబంద పంచాయతీ కార్యదర్శి ఎం.సతీష్ను జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు శుక్రవారం విచారించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట