Yatra Raja: బైక్ నడిపిన సినీ నటుడు ధనుష్ కుమారుడు.. పోలీసులు జరిమానా!
18 ఏళ్లు నిండకుండానే ద్విచక్ర మోటారు వాహనం నడిపిన ప్రముఖ సినీ నటుడు ధనుష్ కుమారుడికి పోలీసులు జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ప్యారిస్, న్యూస్టుడే: 18 ఏళ్లు నిండకుండానే ద్విచక్ర మోటారు వాహనం నడిపిన ప్రముఖ సినీ నటుడు ధనుష్ కుమారుడికి పోలీసులు జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అసలు వివరాల్లోకి వెళితే... ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర(Yatra Raja) ఖరీదైన ద్విచక్ర మోటారు వాహనం నడుపుతున్న వీడియో కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అందులో... తేనాంపేట ప్రాంతంలో బైకు నడుపుతున్న యాత్రకు ఓ వ్యక్తి తర్ఫీదు ఇస్తుండగా మరొకరు వీడియో తీస్తుండగా యాత్ర సహాయకుడు వారించాడు. ఈ నేపథ్యంలో యాత్రకు 17 ఏళ్లేనని, లైసెన్సు, హెల్మెట్ లేకుండా బైకు నడిపాడని, అతనిపై చర్యలు చేపట్టాలని పలువురు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేశారు. దీంతో తేనాంపేట ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టి అతనికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీనిపై ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనరు సుధాకర్ వివరణ ఇస్తూ.. వీడియోలో ఉన్న వ్యక్తి మాస్క్ వేసుకుని ఉండటంతో ఎవరని గుర్తించలేక పోయామని, ఈ విషయమై దర్యాప్తు చేసి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే