Tamil Nadu floods: వరదలో చిక్కుకున్న నా భర్తను కాపాడండి
వరదలో చిక్కుకున్న భర్తను కాపాడాలని భార్య విలపిస్తూ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తూత్తుకుడి జిల్లాలో వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అవసరమైన వారు వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా సహాయం కోరవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
విలపిస్తున్న భార్య వీడియో వైరల్
వివరాలు చెబుతున్న మహిళ
ప్యారిస్, న్యూస్టుడే: వరదలో (Tamil Nadu floods) చిక్కుకున్న భర్తను కాపాడాలని భార్య విలపిస్తూ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తూత్తుకుడి జిల్లాలో వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అవసరమైన వారు వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా సహాయం కోరవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పుళియంకుళానికి చెందిన ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేసింది. అందులో.. స్నేహితుడి కుటుంబాన్ని కాపాడేందుకు తన భర్త వెళ్లాడని, అప్పుడు కారు నీటిలో మునిగిపోవడంతో వాహనం పైకెక్కి తనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపింది. అనంతరం ఫోన్ అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఏమయ్యాడో తెలియలేదని, కాపాడాలని వివిధ కార్యాలయాలకు వెళ్లగా అక్కడికి, ఇక్కడికి వెళ్లాలంటూ తిప్పించారని తెలిపింది. సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదని విలపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం