మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది.
ఆర్కేనగర్, న్యూస్టుడే: తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. మద్యానికి బానిసైన బాలసుబ్రమణ్యం పనికి వెళ్ల్లకుండ తరచూ తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యం తాగడానికి డబ్బులు లేవనే కోపంతో తన కుమార్తె చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చి వీడియో తీసి విదేశాల్లో ఉన్న భార్యకు పంపి డబ్బులు అడిగాడు. వీడియోని చూసిన తల్లి శివరంజని తల్లడిల్లిపోయింది. వెంటనే అధిరపట్టినంలోని తనకు తెలిసిన సామాజికవేత్తకు సమాచారం ఇచ్చింది. అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని కాపాడి, బాలసుబ్రమణ్యాన్ని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఏటీఎంలో నగదు చోరీ
ప్యారిస్, న్యూస్టుడే: చెన్నై పల్లావరం జీఎస్టీ సాలైలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రం మీనంబాక్కం విమానాశ్రయం ఎదురుగా ఉంది. ఈ క్రమంలో బుధవారం ఏటీఎంలో నగదు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. ఏటీఎంలో కొంత నగదు ఉన్నట్లు వారి వద్ద సమాచారం ఉంది. కాని అక్కడికి వెళ్లిచూస్తే ఏటీఎం యంత్రంలో నగదు లేదు. దీంతో వారు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారులు వెళ్లి పరిశీలించగా ఏటీఎం సీక్రెట్ కోడ్ నెంబరు ఉపయోగించి రూ.100 తీసుకుంటే రూ.500 వచ్చేలా సెట్టింగ్ మార్చినట్లు గమనించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు సెట్టింగ్ మార్చి నగదు చోరీచేసినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ చేయడానికొచ్చి నిద్రపోయిన దొంగ
ప్యారిస్, న్యూస్టుడే: తక్కలైకి చెందిన మోహన్దాస్ కొన్ని రోజుల క్రితం ఇంటికి తాళం వేసి భార్యతో పాటు తూత్తుక్కుడిలోని కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు భార్యతో కలిసి సొంతూరికి వచ్చాడు. అప్పుడు ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. లోపలికి వెళ్లి చూడగా ఓ వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. అనంతరం స్థానికుల సాయంతో దుండగుడిని పట్టుకుని పోలీసులకి అప్పగించాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా అతను తిరునెల్వేలికి చెందిన శివశంకర్ అని తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి