పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు.
తాంబరం వాసుల డిమాండు
మూసి ఉన్న సబ్వే తలుపులు
వడపళని, న్యూస్టుడే: పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది సెప్టెంబరు నుంచి తాళాలు వేశారు. స్థానికులు సబ్వేను మూసి ఉంచడంపై పలుమార్లు తాంబరం కార్పొరేషన్, ప్రధాని కార్యాలయానికి వినతులు సమర్పించినా ఎలాంటి పరిష్కారమూ కనిపించలేదు.
పాఠశాలలకు వెళ్లే వారికి..
పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వయసు పైబడిన వారు ఇక్కడి సబ్వే మూసి ఉండటంతో గణపతిపురం సబ్వే గుండా కి.మీ.కుపైగా నడిచి తూర్పు, పడమర తాంబరానికి చేరుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే లైను దాటి వెళ్తున్నారు. రూ.3.8 కోట్లతో నిర్మించిన రైల్వే సబ్వే తూర్పు, పడమర తాంబరానికి అనుసంధానంగా ఉంది. ప్రస్తుతం అక్కడి గేటుకు తాళం వేసి కనిపిస్తోంది. బయట ఉన్న గోడపై సబ్వే పబ్లిక్కు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అనుమతి కల్పిస్తామని, దక్షిణ రైల్వే/తాంబరం కార్పొరేషన్ అని పెయింట్తో రాసిన అక్షరాలు దర్శనమిస్తున్నాయి.
గతంలో ఇక్కడ రైల్వే గేటు..
గతంలో ఇక్కడ లెవల్ క్రాసింగ్ గేటు ఉండేది. పట్టాలు దాటేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులందాయి. 2018లో సబ్వే నిర్మాణం జరిగింది. నిత్యం తిరిగే వేలాది మంది విద్యార్థులు, స్థానికులకు సబ్వే చాలా ఉపయోగకరంగా ఉందని, తూర్పు నుంచి పడమర తాంబరానికి వెళ్లే వారందరూ వినియోగించుకుంటున్నారని ఎప్పుడూ తెరిచి ఉంటే బాగుంటుందని ‘ఎంఈఎస్ రోడ్ గణపతిపురం వెల్ఫేర్ అసోసియేషన్’ అధ్యక్షుడు కె.రమేష్ అన్నారు. కొందరు సంఘ విద్రోహశక్తులు విద్యుద్దీపాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
గతేడాది మార్చిలో సమావేశం..
కిందటి సంవత్సరం మార్చి నెలలో రైల్వే అధికారులు, పోలీసు విభాగం, కార్పొరేషన్ అధికారులు, మేయర్, రైల్వే సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. సబ్వే మరమ్మతులతో పాటు విద్యుద్దీపాలు కూడా అమర్చి తాంబరం కార్పొరేషన్కు అందించారు. అనంతరం రెండు వారాలు సబ్వే తెరిచి ఉంచారు. ఆ తర్వాత నిర్వహణ లోపంతో సెప్టెంబరు 1 నుంచి మూసివేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం కనిపించలేదని మరో సంఘ సభ్యుడు అరుణ్ కుమార్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే