పోలింగ్ శాతం తగ్గడం దేనికి సంకేతం?
రాష్ట్రంలో ముగిసిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో 34 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పలువురు నేతల భిన్నాభిప్రాయాలు
సైదాపేట, న్యూస్టుడే: రాష్ట్రంలో ముగిసిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో 34 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏ కారణంగా ప్రజలు ఓటేసేందుకు రాలేదన్న చర్చ మొదలైంది. అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి నష్టం చూకూరుస్తుందనే విషయంపై పలువురు నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
డీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎస్ భారతి... డీఎంకే కూటమికి పడాల్సిన ఓట్లు యథాతథంగా పడతాయని, ఎన్నికల్లో మహిళలు ఎక్కువగా ఓటేశారన్నారు. ఇది డీఎంకేకు అనుకూలంగా చెప్పారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్నందున డీఎంకేకు మెజారీటీ కాస్త తక్కువగా ఉంటుందని, మొత్తానికి విజయం డీఎంకేదే అన్నారు.
అన్నాడీఎంకే కోశాధికారి దిండుక్కల్ శీనివాసన్... అన్నాడీఎంకే, డీఎంకే, భాజపా కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొందని, ఇందులో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే ప్రధాన పోటీ అన్నారు. గ్రామ స్థాయి నుంచి డీఎంకే, అన్నాడీఎంకేలకు కార్యకర్తలున్నారని తెలిపారు. భాజపాకు ఆ విధంగా లేరన్నారు. కావున పోలింగ్ శాతం తగ్గడం భాజపాకు ఎక్కువ నష్టం చేకూరుస్తుందని, ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించదన్నారు. నామ్ తమిళర్ కట్చి నియోజకవర్గానికి 10 నుంచి 15 వేల ఓట్లు పొందుతుందని పేర్కొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్... పోలింగ్ శాతం తగ్గినా ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఎవరు విజయం సాధించాలనుకునేవారు తప్పకుండా ఓటేసి ఉంటారన్నారు. ఆ మేరకు డీఎంకే కూటమికి దక్కాల్సిన ఓట్లు దక్కుంటాయని తెలిపారు. భాజపా, అన్నాడీఎంకేకు విజయం సాధిస్తామనే నమ్మకం లేదన్నారు. వారి దగ్గర ఎన్నికల వ్యూహం కూడా లేదన్నారు. కావున నష్టం భాజపా, అన్నాడీఎంకేలకే అని పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్... పోలింగ్ శాతం తగ్గినా గెలిచేది డీఎంకే కూటమేనని, పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?