ట్రాన్స్జెండర్లకు పాస్పోర్ట్ మంజూరు వ్యవహారం
లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్జెండర్లు పాస్పోర్డ్ కావాలంటే చికిత్స పొందిన ఆస్పత్రి అందజేసే ధ్రువపత్రం దాఖలు చేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
కేంద్రం జవాబు కోరిన హైకోర్టు
ప్యారిస్, న్యూస్టుడే: లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ట్రాన్స్జెండర్లు పాస్పోర్డ్ కావాలంటే చికిత్స పొందిన ఆస్పత్రి అందజేసే ధ్రువపత్రం దాఖలు చేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. మైలాపూర్కి చెందిన శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్లో... శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్జెండర్లుగా మారే వారు పాస్పోర్టు పొందాలంటే ఆస్పత్రి అందజేసే ధ్రువపత్రం దాఖలు చేయాలన్న నిబంధన రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు వ్యతిరేకమన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం కావున ధ్రువపత్రాన్ని జతచేయాలన్న విభాగాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ శనివారం చీఫ్ జస్టిస్ గంగాపూర్వాలా, జస్టిస్ భరత చక్రవర్తి ధర్మాసనంలో విచారణకు వచ్చింది. సహజంగా ట్రాన్స్జెండర్లు అయిన వారికి ఈ నిబంధన వర్తించదని, అదే సమయంలో లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్జెండర్లుగా మారే వారికి శస్త్రచికిత్స చేసిన ఆస్పత్రి ధ్రువపత్రం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తరఫున తెలిపారు. అనంతరం పిటిషన్పై జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను 29కి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల