ప్రముఖ వేద పండితుడు రోహిణీ కుమార్ శాస్త్రి కన్నుమూత
ప్రముఖ వేద పండితుడు, పురోహితుడు తాండ్ర రోహిణీకుమార్ శాస్త్రి (68) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. శనివారం ఉదయం నిద్రలేవకపోవడంతో కుటుంబీకులు వైద్యులను పిలిపించారు.
రోహిణీకుమార్ శాస్త్రి భౌతికకాయం వద్ద కుటుంబీకులు
వడపళని, న్యూస్టుడే: ప్రముఖ వేద పండితుడు, పురోహితుడు తాండ్ర రోహిణీకుమార్ శాస్త్రి (68) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. శనివారం ఉదయం నిద్రలేవకపోవడంతో కుటుంబీకులు వైద్యులను పిలిపించారు. వారు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. శాస్త్రి నగరంలోని పలు తెలుగు సంఘాలు, తెలుగు వారికి సుపరిచితుడు. చెన్నైలో (అప్పటి మద్రాసు) తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల్లో ఈయన, అన్నయ్య అశ్వనీ కుమార్ శాస్త్రి పాటల రికార్డింగు, కొత్త సినిమా షూటింగులకు ముహూర్తాలు నిర్ణయించే వారు. ఈ సోదరులు నిర్ధారించే ముహూర్తాల సమయంలో సినిమాలు తీస్తే బాగా విజయవంతమవుతాయనే నమ్మకం పలువురు నిర్మాతల్లో ఉండేది. వీరి తండ్రి తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన వృత్తి రీత్యా వేదపండితుడు, పురోహితుడు. ఈ ఇద్దరు సోదరులు డిగ్రీలు చదివిన తర్వాత తండ్రి బాటలోనే సాగారు. వారు పెట్టే ముహూర్తాల సమయంలో సినిమాలు తీస్తే బాగా విజయవంతమవుతాయనే నమ్మకం పలువురు నిర్మాతల్లో ఉండేది. ఒక్క తెలుగు సినిమా రంగానికే కాకుండా పలు తమిళ చిత్రాల నిర్మాతలకు కూడా ఈ ఇద్దరు బాగా పరిచయమున్నవారే. తమిళనాడు ప్రభుత్వం తరఫున జరిగే పెద్ద కార్యక్రమాలకు పూజల్లో పాల్గొనేవారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. అమెరికాలో ఉన్న ఇద్దరు కుమార్తెలు, అన్న అశ్వనీ శాస్త్రి ఆదివారం రాత్రి చెన్నైకి చేరుకోనున్నారని కుటుంబీకులు తెలిపారు. మూడో కుమార్తె చెన్నైలోనే ఉంటున్నారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రభుత్వం తరఫున జయలలిత ఆధ్వర్యంలో జరిగిన ఓ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అశ్వనీ శాస్త్రి, రోహిణీ శాస్త్రి
దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి దంపతులు, ఇతర మంత్రుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును పూలమాలతో సత్కరిస్తున్న సోదరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల