logo

నిరం మారుం ఉలగిల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

ప్రముఖ దర్శకుడు భారతిరాజా ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నిరం మారుం ఉలగిల్‌’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆదివారం విడుదలైంది.

Published : 22 Apr 2024 01:24 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రముఖ దర్శకుడు భారతిరాజా ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నిరం మారుం ఉలగిల్‌’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆదివారం విడుదలైంది. ఈ సినిమాలో భారతిరాజాతో పాటు నట్టి, రియోరాజ్‌, శాండి, సురేష్‌ మేనన్‌, ఆడుగళమ్‌ నరేన్‌, మైమ్‌ గోపి, వడివుక్కరసి, విగ్నేష్‌కాంత్‌, కనికా, ఆదరా తదితరులు ఇతర తారాగణం. మల్లికా అర్జున్‌, మణికంఠ రాజా సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకి దేవ ప్రకాష్‌ సంగీతం అందించారు. సిగ్నేచర్‌ ప్రొడక్షన్‌, జీఎస్‌ సినిమా ఇంటర్నేషనల్‌ సంస్థలు సినిమాను నిర్మిస్తున్నాయి. నలుగురు వ్యక్తుల జీవితం ఒక చోట కలిసే కథగా ఈ సినిమా రూపొందింది. జీవితంలో సంబంధబాంధవ్యాల గురించి తెలియజేసే సినిమాగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.


తలైవర్‌ 171 కొత్త పోస్టర్‌...

సైదాపేట: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘వేట్టయ్యన్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిన సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత రజనీకాంత్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా ‘తలైవర్‌ 171’ అని వర్కింట్‌ టైటిల్‌ పెట్టారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో రజనీ ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలై మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రజనీ దాదాగా నటిస్తున్నట్లు సమాచారం. రన్‌వీర్‌ సింగ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 22న ఫస్ట్‌లుక్‌ ప్రివ్యూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి కొత్త పోస్ట్‌ర్‌ ఆదివారం విడుదలైంది. అందులో రజనీకాంత్‌ చేయి, గడియారాలతో చేసిన గొలుసును పట్టుకుని ఉన్నారు. ఈ పోస్టర్‌ను లోకేష్‌ కనకరాజ్‌ తన ఎక్స్‌ పేజీలో విడుదల చేశారు.


కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో సూర్య 44వ సినిమా

సైదాపేట, న్యూస్‌టుడే: సూర్య నటించనున్న 44వ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జూన్‌ 17న ప్రారంభం కానుంది. పిజ్జా సినిమాతో తమిళ సినిమాకు పరిచయం అయిన దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ వైవిధ్యమైన సినిమాలు తీయడంలో దిట్ట. ఈయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య నటించిన ‘జిగర్తాండా-2’ భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కార్తిక్‌ సబ్బురాజ్‌ తదుపరిగా సూర్య నటించే 44వ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని