రాష్ట్ర అధికారుల సాయంతో డీఎంకే కుట్ర
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర అధికారుల సాయంతో డీఎంకే చేసిన కుట్ర బట్టబయలు అయిందని, మళ్లీ ఎన్నికలు జరపాలని భాజపా డిమాండ్ చేసింది.
భాజపా ఆరోపణ
రీపోలింగ్కు డిమాండ్
చెన్నై మాధవరంలోని నాగకన్నిక అమ్మన్ ఆలయంలో ఆదివారం జరిగిన కుంభాభిషేకంలో
పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్న రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి దంపతులు
సైదాపేట, న్యూస్టుడే
సైదాపేట, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర అధికారుల సాయంతో డీఎంకే చేసిన కుట్ర బట్టబయలు అయిందని, మళ్లీ ఎన్నికలు జరపాలని భాజపా డిమాండ్ చేసింది. దీని గురించి ఆదివారం తమిళనాడు భాజపా ప్రచారకర్త ఏఎన్ఎస్ ప్రసాద్ విడుదల చేసిన ప్రకటనలో... లోక్సభ ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల కమిషన్ అయినా విధులు నిర్వహించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులేనని తెలిపారు. తమిళనాడుకు సంబంధించినంత వరకు ఓటరు జాబితా తయారీ, సరిచూడటం, చివరి జాబితా విడుదల, నామినేషన్ దాఖలు, ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, పోలింగ్ విధులు నిర్వహించేది తమిళనాడు అధికారులు, జిల్లా కలెక్టర్లేనని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా పని చేశారన్నారు. వీరంతా పూర్తిగా డీఎంకే నియంత్రణలో ఉన్నారని ఆరోపించారు. కోయంబత్తూరు తదితర నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందే ప్రణాళిక ప్రకారం తమకు కావల్సిన అధికారులను జిల్లా కలెక్టర్లుగా డీఎంకే ప్రభుత్వం నియమించిందన్నారు. దీంతో తమిళనాడులో నిజాయతీగా ఎన్నికలు జరగలేదన్నారు. పోలింగ్ శాతం ప్రకటనలో ఏర్పడిన గందరగోళంతో ఇది తెలుస్తోందన్నారు. తమకు అనుకూలమైన అధికారుల ద్వారా తమిళనాడులో ఉండే 39 నియోజకవర్గాల్లో భాజపాకు ఓటేసే ఉత్తర భారతీయులు, ప్రత్యేక సామాజికవర్గాల ప్రజల ఓట్లను జాబితా నుంచి చివరి క్షణంలో తొలగించారన్నారు. ముఖ్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై, ఏపీ మురుగానందం, పాల్ కనకరాజ్, వినోజ్ పి.సెల్వం తదితర భాజపా ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో తలా లక్ష ఓట్ల చొప్పున తొలగించారని ఆరోపించారు. డీఎంకే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పనులను అన్నామలై పోలింగ్ రోజే తేటతెల్లం చేశారని తెలిపారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన వారిని జాబితాలో చేర్చి మళ్లీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?