logo

విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి

తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు.

Published : 18 May 2024 04:02 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తమ విడాకుల వ్యవహారంలో ఎవరి జోక్యం లేదని గాయని సైంధవి అన్నారు. నటుడు జీవీ ప్రకాశ్‌, సైంధవి విడాకులు విషయం గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. జీవీ ప్రకాశ్‌ సినిమాల్లో నటించడం సైంధవికి ఇష్టం లేదని, అత్తతో సమస్య అని పలు రకాలుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భావాలను గౌరవించాలని జీవీ ప్రకాశ్‌ విజ్ఞప్తి చేశారు. సైంధవి కూడా స్పందిస్తూ.. తమ వ్యక్తిగత విషయంలో తలదూర్చకూడదని కోరారు. పలు యూట్యూబ్‌ ఛానెళ్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇద్దరి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పాఠశాల నుంచే తాను, జీవీ 24 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామన్నారు. విడిపోయినా స్నేహం కొనసాగుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు