నైరుతి బంగాళాఖాతంలో 22న అల్పపీడనం
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో..
ప్యారిస్, న్యూస్టుడే: రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. దక్షిణ తమిళనాడు సముద్రతీర ప్రాంతాలు, ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో 24న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులో మంగళవారం చాలాచోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేని, విరుదునగర్, తెన్కాశి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కన్నియాకుమరి, తిరునెల్వేలి, మదురై, దిండుక్కల్, తిరుప్పూర్, కోయంబత్తూరు, నీలగిరి, శివగంగై, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుతురై జిల్లాలు, కారైక్కల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 22న రాష్ట్రంలో అనేక చోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, తేని, తిరునెల్వేలి, కన్నియాకుమరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 23న రాష్ట్రంలో కొన్నిచోట్ల, పుదుచ్చేరి, కారైక్కల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, కన్నియాకుమరి, తిరునెల్వేలి, తెన్కాశి, కృష్ణగిరి, ధర్మపురి, తిరుప్పత్తూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షానికి అవకాశం ఉందని, చెన్నైలో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు 23లోపు తీరానికి చేరుకోవాలని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి