లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం: ఎడప్పాడి పళనిస్వామి
లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఆశ్చర్యకర ఫలితాలు సాధించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు.
మలరవన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎడప్పాడి
కోయంబత్తూరు, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఆశ్చర్యకర ఫలితాలు సాధించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. కోవై గణపతినగర్కు చెందిన మాజీ ఎమ్మెల్యే మలరవన్ కొద్దిరోజుల కిందట వయోభారంతో మృతి చెందారు. ఆయన కుటుంబీకులను ఎడప్పాడి పళనిస్వామి సోమవారం కలిసి పరామర్శించారు. మలరవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షం కావాలనే వందలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. కేరళ ప్రభుత్వం సిలందై నదిలో చెక్డ్యామ్ నిర్మించడాన్ని అడ్డుకోవాలని డిమాండు చేశారు. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటులో, ఆంధ్ర ప్రభుత్వం పాలారు నదిలో చెక్డ్యామ్ల నిర్మాణాన్ని అడ్డుకుని రాష్ట్ర రైతులను కాపాడాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెన్నైవాసుల దాహార్తి తీర్చేందుకు కన్నన్కోట్టైలో రూ.400 కోట్లతో చెరువు నిర్మించిన విధంగా డీఎంకే ప్రభుత్వం కొత్త జలాశయాలు నిర్మించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ