logo

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం: ఎడప్పాడి పళనిస్వామి

లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఆశ్చర్యకర ఫలితాలు సాధించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 21 May 2024 01:06 IST

మలరవన్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎడప్పాడి

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఆశ్చర్యకర ఫలితాలు సాధించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. కోవై గణపతినగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మలరవన్‌ కొద్దిరోజుల కిందట వయోభారంతో మృతి చెందారు. ఆయన కుటుంబీకులను ఎడప్పాడి పళనిస్వామి సోమవారం కలిసి పరామర్శించారు. మలరవన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పాలకపక్షం కావాలనే వందలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. కేరళ ప్రభుత్వం సిలందై నదిలో చెక్‌డ్యామ్‌ నిర్మించడాన్ని అడ్డుకోవాలని డిమాండు చేశారు. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటులో, ఆంధ్ర ప్రభుత్వం పాలారు నదిలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని అడ్డుకుని రాష్ట్ర రైతులను కాపాడాలని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెన్నైవాసుల దాహార్తి తీర్చేందుకు కన్నన్‌కోట్టైలో రూ.400 కోట్లతో చెరువు నిర్మించిన విధంగా డీఎంకే ప్రభుత్వం కొత్త జలాశయాలు నిర్మించాలని కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని