logo

ప్రజా సమస్యలు పట్టని సీఎం

ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రజా సమస్యల పరిష్కారంపై ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో...

Updated : 21 May 2024 06:01 IST

అన్నామలై

సైదాపేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రజా సమస్యల పరిష్కారంపై ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కేరళ ప్రభుత్వం సిలంది నదిలో డ్యామ్‌ నిర్మిస్తోందని తెలిపారు. అమరావతి నదికి నీటి రాక తగ్గి రాష్ట్ర రైతులు నష్టపోతారని అన్నారు. డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర రైతుల ప్రయోజనాలపై ఎలాంటి దిగులు లేకుండా ఉందని ఆరోపించారు. తమిళనాడు ప్రజల సంక్షేమాన్ని, హక్కులను తాకట్టు పెట్టేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే వేయి డ్యామ్‌లు నిర్మిస్తామని డీఎంకే చెప్పిందని, మూడేళ్లు దాటినా ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. డీఎంకేకు గోపాలపురం కుటుంబ సంక్షేమం కంటే ప్రజల బాగోగులపై ఎలాంటి బాధ్యత లేదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని