పలు భాషల్లోకి పార్కింగ్
రాంకుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో హరీశ్ కల్యాణ్, ఎం.ఎస్.భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా గత డిసెంబరు 1న విడుదలైన చిత్రం ‘పార్కింగ్’. ఒకే భవనంలో పైఅంతస్తు,
చెన్నై, న్యూస్టుడే: రాంకుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో హరీశ్ కల్యాణ్, ఎం.ఎస్.భాస్కర్ ప్రధాన పాత్రధారులుగా గత డిసెంబరు 1న విడుదలైన చిత్రం ‘పార్కింగ్’. ఒకే భవనంలో పైఅంతస్తు, కింది అంతస్తులో బాడుగకు ఉండేవారి మధ్య ఏర్పడిన పార్కింగ్ సమస్య నేపథ్యంతో రూపొందిన చిన్న బడ్జెట్ చిత్రమిది. ప్రేక్షకుల విశేష ఆదరణాభిమానాలు పొందిన ఈ చిత్రం పునర్నిర్మాణ హక్కులను పెద్ద మొత్తానికి విక్రయించారు. ఆ మేరకు ఐదు భారతీయ భాషలు, ఓ అంతర్జాతీయ భాషలో చిత్రం పునర్నిర్మాణం కానుందని కోలీవుడ్ సమాచారం.
మళై పిడిక్కాద మనిదన్ టీజర్ 29న
చిత్రం పోస్టరు
చెన్నై, న్యూస్టుడే: విజయ్ ఆంటోని, శరత్కుమార్ కలిసి నటించిన చిత్రం ‘మళై పిడిక్కాద మనిదన్’. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలోని ఈ సినిమాలో సత్యరాజ్, డాలి ధనంజయ, మురళీశర్మ, మేఘా ఆకాశ్, తలైవాసల్ విజయ్, శరణ్య పొన్వణ్ణన్ తదితరులు నటించారు. టీజర్ 29న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కొట్టుకాళి
చెన్నై, న్యూస్టుడే: ‘ది లిటిల్ వేవ్ ప్రొడక్షన్స్’తో నటుడు శివకార్తికేయన్కు చెందిన ఎస్కే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కొట్టుకాళి’. వినోద్రాజ్ దర్శకత్వంలోని ఈ చిత్రంలో నటుడు సూరి, మలయాళ నటి అన్నా బెన్ ప్రధాన పాత్రలు పోషించారు. 74వ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడానికి ‘కొట్టుకాళి’ ఎంపికైంది. ఓ తమిళ చిత్రం ఈ గౌరవాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శనకు ఎంపికైంది. చిత్ర దర్శకుడు వినోద్రాజ్ గతంలో దర్శకత్వం వహించిన ‘కూళాంకల్’ కూడా ట్రాన్సిల్వేనియా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్