పునరుత్పాదక విద్యుత్తులో మూడో ర్యాంకు
రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) 22,161 మెగావాట్లకు చేరుకుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్లుండగా తమిళనాడు మూడో ర్యాంకులో ఉందని వెల్లడైంది.
22 వేల మెగావాట్లు దాటిన ఉత్పత్తి
వడపళని, న్యూస్టుడే: రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పునరుత్పాదక విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) 22,161 మెగావాట్లకు చేరుకుంది. కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, రాజస్థాన్లుండగా తమిళనాడు మూడో ర్యాంకులో ఉందని వెల్లడైంది. సౌర విద్యుత్తు ద్వారా 7,516 మెగావాట్లు, డాబాల పైన(రూఫ్ టాప్) సౌర ప్లాంట్ల నుంచి 599 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. పంట భూముల్లో సౌరప్లాంట్ల ఏర్పాటు చేసుకోవడంలో రైతుల నుంచి సుముఖత కనిపించడంలేదు. ఇప్పటివరకు 66 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే పంట భూముల నుంచి ఉత్పత్తి కాగా, మొత్తం సౌర విద్యుత్తు ద్వారా 8,211 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతోంది.
వర్షాకాలంలో..
- పర్యావరణ కాలుష్యం, భూతాపం తగ్గించుకోవడానికి కేంద్రం పునరుత్పాదక ఇంధన వనరులకే మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లు 4,320 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నట్టు గత ఏడాది విద్యుత్తు శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ సమర్పించిన నివేదకలో తెలిసింది. 34,706 మెగావాట్ల సామర్థ్యంలో 16,417 మెగావాట్లు సంప్రదాయ వనరుల మూలంగా సమకూర్చుకోగా, పునరుత్పాదక ఉత్పత్తి ద్వారా 18,288 మెగావాట్లు అందుతోంది. మొత్తం ఉత్పత్తి అయ్యే 34,706 మెగావాట్లలో సంప్రదాయ వనరుల ద్వారా వచ్చే విద్యుత్తు 50శాతం వరకు ఉంటోంది. పవన విద్యుత్తు ఏడాది పొడవునా నిలకడగా ఉండదు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాల సమయంలో కాస్త ఎక్కువగా ఉంటూ మిగిలిన సీజన్లలో తక్కువగా ఉంటుంది.
- పవన, సౌర విద్యుత్తు ఉత్పత్తి సెప్టెంబరు మాసంలో బాగా ఉన్నా, థర్మల్ పవర్ స్టేషన్లలో ఉత్పత్తి తగ్గి వాయు కాలుష్యం తగ్గుతుంది. కోయంబత్తూరు, దిండిగల్లు, ఉడుమలై, తేని, తిరునెల్వేలి, కన్నియాకుమారి, తిరుచెందూరులో ప్రైవేటు సంస్థలు పవన విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా ఉత్పత్తి అయిన వివరాలను లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనుంది.
రాష్ట్ర వాటా 11.66 శాతం
దేశంలో మొత్తం సంస్థాపన సామర్థ్యంతో కూడిన పవన విద్యుత్తు 45,886 మెగావాట్లుగా ఉంది. సౌర విద్యుత్తు ద్వారా దేశంలో 81,813 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. ఏడాదిలో ఎక్కువ కాలం ఉష్ణోగ్రతలు బాగా ఉండటంతో సౌర విద్యుత్తు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. సౌర విద్యుత్తు కన్నా హైడ్రో విద్యుత్తు ఉత్పత్తి 51,931 మెగావాట్ల వరకు ఉంటోంది. దేశంలోని చక్కెర మిల్లులు 10,941 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. దేశం మొత్తంపై పునరుత్పాదక విద్యుత్తు 1.9 లక్షల మెగావాట్లుగా ఉంది. ఇందులో తమిళనాడు వాటా 11.66 శాతంగా ఉండటం గమనార్హం.
హైడ్రో ప్రాజెక్టులు..
హైడ్రో ప్రాజెక్టుల ద్వారా 2,301 మెగావాట్ల ఉత్పత్తి అవుతుండగా, మొత్తం పునరుత్పాదక శక్తి సంస్థాపన సామర్థ్యంతో 22,181 మెగావాట్ల మేరకు ఉత్పత్తి అవుతోంది. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో అన్ని రాష్ట్రాలకన్నా గుజరాత్ 27,462 మెగావాట్లతో మొదటి ర్యాంకు, 27,103 మెగావాట్లతో రాజస్థాన్ రెండో ర్యాంకులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.