ఇన్స్టాగ్రామ్ వేదికగా యువతులకు వల
చెన్నై పోరూరుకు చెందిన యువకుడు ఆనంద్బాబు ఇన్స్ట్రాగ్రామ్లో నకిలీ ఖాతా ఏర్పాటు చేసుకుని మంచి శరీర సౌష్టవంతో ఉన్న ఫొటోలు పెట్టి పలువురు యువతులకు వల విసురుతుంటాడు.
నగ్న వీడియోలు రికార్డు చేసి బెదిరింపులు
నకిలీ ఫొటోలతో మోసగిస్తున్న యువకుడి అరెస్టు
అరెస్టయిన ఆనంద్బాబు
సైదాపేట, న్యూస్టుడే: చెన్నై పోరూరుకు చెందిన యువకుడు ఆనంద్బాబు ఇన్స్ట్రాగ్రామ్లో నకిలీ ఖాతా ఏర్పాటు చేసుకుని మంచి శరీర సౌష్టవంతో ఉన్న ఫొటోలు పెట్టి పలువురు యువతులకు వల విసురుతుంటాడు. కొన్ని రోజుల క్రితం చెన్నై షావుకారుపేటకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో జిమ్ బాడీతో ఉన్న అతని ఫొటో నచ్చడంతో ఆ యువతి అతనితో చనువుగా మాట్లాడటం ప్రారంభించింది. ఈ క్రమంలో అతను వీడియో కాల్లో అందాలను చూపాలని ఆమెను కోరాడు. కోపగించుకున్న యువతి.. అతన్ని దుర్భాషలాడింది. దీంతో అతను హత్యా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యువతి సెవెన్వెల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆనంద్బాబుని అరెస్టు చేశారు. అతని దగ్గర స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో వంద మందికిపైగా యువతుల అభ్యంతరకర వీడియోలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా మహిళలతో పరిచయం ఏర్పరుచుకుని వారి నగ్న శరీరాన్ని లైవ్ వీడియోలో చూస్తున్నట్లు తెలిసింది. 40 మంది యువతులు లైవ్ వీడియోలో తమ అందాలను ఎలాంటి సంకోచం లేకుండా ఆనంద్బాబుకు చూపినట్లు తెలుస్తోంది. కళాశాల విద్యార్థినులు కూడా ఇతని మాయలో పడినట్లు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్