కవిన్కు జోడీగా నయనతార?
దర్శకుడు నెల్సన్ నిర్మిస్తున్న ‘బ్లడి బగర్’, అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఊర్ కురివి’ చిత్రాల్లో కవిన్ నటిస్తున్నారు.
చెన్నై, న్యూస్టుడే: దర్శకుడు నెల్సన్ నిర్మిస్తున్న ‘బ్లడి బగర్’, అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఊర్ కురివి’ చిత్రాల్లో కవిన్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘7 స్క్రీన్ స్టూడియో’ నిర్మిస్తున్న ఓ చిత్రంలోనూ కవిన్ హీరోగా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రంలో ఆయనకు జోడీగా నయనతార నటించనున్నట్టు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి మాటలు రచయిత, గేయ రచయిత విష్ణు ఏదావన్ దర్శకత్వం వహించనున్నారనీ తెలిసింది.
రాయన్ రెండో సింగిల్ విడుదల నేడు
చెన్నై: ధనుష్ 50వ చిత్రంగా ‘రాయన్’ రూపొందుతున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఏ.ఆర్.రహమాన్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం తొలి సింగిల్ ఇటీవల విడుదలై శ్రోతల ఆదరణాభిమానాలు పొందింది. ఈ నేపథ్యంలో రెండో సింగిల్ శుక్రవారం విడుదల కానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టరులో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ సైకిల్పై వెళ్లే దృశ్యం ఆకట్టుకుంటోంది.
పిళ్లైయార్ సుళి చిత్రీకరణ పూర్తి
చెన్నై: మనోగరన్ పెరియతంబి దర్శకత్వం వహించిన ‘పిళ్లైయార్ సుళి’ చిత్రంలో ధీరజ్, అభినయ హీరోహీరోయిన్లుగా నటించారు. రేవతి, మైమ్ గోపి, మాథ్యూ వర్గీస్, పవర్ స్టార్ శ్రీనివాసన్, దర్శన్, జీవా రవి, పళని దేవి, ఆర్జే మహాలక్ష్మి తదితరులు ఇతర తారాగణం. ఓ దివ్యాంగ చిన్నారి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు వెల్లడించారు. చిత్రీకరణ పనులు ముగిసి తుదిదశ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్రం న్యూయార్క్ చిత్రోత్సవాల్లో ఇటీవల ఆఖరి రౌండ్కు ఎంపికకావడం గమనార్హం.
అరణ్మనై-4 వసూళ్ల రికార్డు
చెన్నై: సుందర్.సి దర్శకత్వంలో ‘అరణ్మనై-4’ మే 3న విడుదలైన విషయం తెలిసిందే. తొలి మూడు భాగాలు తరహాలోనే ఈ చిత్రంలోనూ సుందర్.సి నటించారు. తమన్నా, రాశి కన్నా, యోగిబాబు, కోవై సరళ, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర నటీనటులు. మిగతా మూడు చిత్రాల కన్నా ఈ సినిమాలో గ్రాఫిక్స్, విఎఫెక్స్ దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు భాషల్లో, ప్రపంచ స్థాయిలో విడుదలైంది. చిత్రం విడుదలై 19 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో వసూళ్ల పరంగా ‘అరణ్మనై-4’ తొలిస్థానంలో ఉంది. రాష్ట్రంలో విడుదలైన ‘మంజుమ్మల్ బాయ్స్’ వసూళ్ల రికార్డునూ అధిగమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం