సవుక్కు శంకర్పై మరో ఫిర్యాదు
తన కుమార్తె, తన కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన సవుక్కు శంకర్పై చర్యలు తీసుకోవాలని కళ్లకుర్చికి చెందిన సెల్వి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల అదుపులో సవుక్కు శంకర్
వేళచ్చేరి, న్యూస్టుడే: తన కుమార్తె, తన కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన సవుక్కు శంకర్పై చర్యలు తీసుకోవాలని కళ్లకుర్చికి చెందిన సెల్వి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సవుక్కు మీడియా యూట్యూబ్ ఛానెల్లో 2022 జులై 20న కళ్లకురిచ్చి వ్యవహారం పేరిట సవుక్కు శంకర్ వీడియో విడుదల చేశారని గుర్తు చేశారు. తమపై బురద జల్లేలా వ్యాఖ్యలు చేశారని, అప్పట్లో తన వద్ద ఆధారాలు లేవన్నారు. సవుక్కు శంకర్ వద్ద సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్ అనే వ్యక్తి ప్రైవేటు ఛానెల్కు ఇచ్చిన భేటీలో కళ్లకురిచ్చి వ్యవహారంలో సవుక్కు శంకర్ డబ్బులు తీసుకొని తప్పుడు వ్యాఖ్యలు చేశాడని తెలిపారన్నారు. సవుక్కు శంకర్పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ప్యారిస్: యూట్యూబర్ సవుక్కు శంకర్ బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. మహిళా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోయంబత్తూరు సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తేనిలో ఉన్న సమయంలో గంజాయితో ఉన్నట్లు అతనిపై, అతని సహాయకుడు రాజారత్నం, డ్రైవర్ రామ్ ప్రభులపై తేని పోలీసులు కేసు నమోదు చేశారు. తేని పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరి సవుక్కు శంకర్ మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం