చెన్నైలో ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల అరెస్టు
ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఉగ్రవాద సంస్థకు రాయపేటలో ఉంటున్న ముగ్గురు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు చెన్నై పోలీసులకి సమాచారం అందింది.
ప్యారిస్, న్యూస్టుడే: ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఉగ్రవాద సంస్థకు రాయపేటలో ఉంటున్న ముగ్గురు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు చెన్నై పోలీసులకి సమాచారం అందింది. ఆ మేరకు సైబర్ క్రైం పోలీసులు రాయపేటలో దర్యాప్తు తీవ్రతరం చేశారు. ‘హిస్బ్ ఉద్ తాహిర్’ అనే ఉగ్రవాద సంస్థకు మద్దతుగా రాయపేటకి చెందిన డాక్టర్ హమీద్ హుస్సేన్, అతని తండ్రి అహ్మద్ అన్సూర్, తమ్ముడు అబ్దుల్కుమాన్లు పనిచేస్తున్నట్లు తెలిసింది. హమీద్ హుస్సేన్ అన్నా వర్సిటీలో ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు. అనంతరం వారిని కమిషనరు కార్యాలయానికి తీసుకెళ్లి దర్యాప్తు చేయగా.. ప్రతి ఆదివారం తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉగ్రవాద పోరాటానికి సంబంధించిన అభిప్రాయాలు పోస్టు చేసి, ప్రచారం చేసి, సంస్థలో కొత్తవారిని చేరుస్తున్నట్లు తెలిసింది. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి జైల్లో వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉగ్రవాద నియంత్రణ విభాగ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం