అన్నామలై పొగడ్తలు అన్నాడీఎంకేకు అవసరం లేదు
అన్నామలై పొగడ్తలు అన్నాడీఎంకేకు అవసరం లేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ తెలిపారు. మదురై జిల్లా అలంగానల్లూర్ కోట్టైమేడులో పార్టీ తరఫున అన్నదానాన్ని మాజీ మంత్రి శనివారం ప్రారంభించారు.
ఆర్బీ ఉదయకుమార్
ప్యారిస్, న్యూస్టుడే: అన్నామలై పొగడ్తలు అన్నాడీఎంకేకు అవసరం లేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ తెలిపారు. మదురై జిల్లా అలంగానల్లూర్ కోట్టైమేడులో పార్టీ తరఫున అన్నదానాన్ని మాజీ మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మదురై, తేని, దిండుక్కల్ తదితర ఐదు జిల్లాల తాగు, సాగుకు అవసరమైన నీటిని అందించే ముల్లైపెరియార్లో మూడేళ్లుగా కేరళ ప్రభుత్వం కొత్త జలాశయాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దాన్ని అడ్డుకోకుండా డీఎంకే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో మదురై లేదా తేనిలో రైతుల హక్కులను కాపాడేందుకు అతిపెద్ద ఆందోళన చేపడతామని చెప్పారు. జయలలిత హిందుత్వ సిద్ధాంతాలు పాటించారని, ఆమె లేకపోవడంతో తాము పాటిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారన్నారు. అన్నాడీఎంకే మరో వందేళ్లు ప్రజాసేవ చేయాలన్న అమ్మ మాటలను ఎడప్పాడి పళనిసామి పాటించి ముందుకు సాగుతున్నారని తెలిపారు. అన్నామలై ప్రశంసలు అన్నాడీఎంకేకు అవసరం లేదన్నారు. ఆయన అన్నాడీఎంకే సభ్యుడిగా ఉండి అమ్మ గురించి మాట్లాడితే ఆమోదిస్తామన్నారు. ప్రజల కోసం తనను అంకితం చేసుకొని జీవించిన జయలలితను.. అన్నామలై రాజకీయ లబ్ధికి పొగిడితే ప్రజలు ఎలా ఆమోదిస్తారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం