ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన 3నెలల్లోనే పుదువైకు రాష్ట్ర హోదా
ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన మూడునెలల్లోపు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తారని మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ..
విలేకరులతో మాట్లాడుతున్న నారాయణస్వామి
ఆర్కేనగర్, న్యూస్టుడే: ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన మూడునెలల్లోపు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తారని మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ ఇష్టానుసారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేయడం అందరూ చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, కూటమి పార్టీలు ఇస్లామ్, ఉగ్రవాదాన్ని మద్దతిచ్చే పార్టీ అని, వారు పాలనలోకి వస్తే రాముడి ఆలయాన్ని కూల్చివేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తాను అవతారపురుషుడినని చెప్పుకొంటున్నారన్నారు. ఆరు విడతల ఎన్నికల్లో ఇండియా కూటమికే అధికస్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కూటమికి 300 స్థానాలు వస్తాయన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఇండియా కూటమి 40 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. తమిళనాడు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారని విమర్శించారు. పుదువై ప్రస్తుత ముఖ్యమంత్రి రాష్ట్ర హోదా తీసురాలేకపోయారని, ఇండియా కూటమి పాలనలోకి వచ్చిన మూడునెలల్లోనే హోదా తెప్పిస్తామని మేనిఫేస్టోలో ప్రకటించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే