ఒకే కార్డు.. ప్రయోజనాలు మెండు
నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్’ (ఎన్సీఎంసీ)తో మెట్రో రైళ్లతో పాటు ‘మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్’ (ఎంటీసీ) బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది.
‘ఎన్సీఎంసీ’తో ఎంటీసీ బస్సులోనూ ప్రయాణం
త్వరలో అందుబాటులోకి సేవలు
న్యూస్టుడే, వడపళని
నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్’ (ఎన్సీఎంసీ)తో మెట్రో రైళ్లతో పాటు ‘మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్’ (ఎంటీసీ) బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. ప్రజా రవాణా మరింత మెరుగు పరచాలనే దృక్పథంతో చెన్నై మెట్రో రైలు గత ఏడాది ఏప్రిల్లో ఒక కార్డుతో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఈ రోజు వరకు మెట్రో రైలు ప్రయాణికులు మాత్రమే కార్డు కొనుక్కున్నప్పటికీ 16 శాతం మంది కార్డు సేవలను ప్రతిరోజూ వినియోగించుకుంటున్నారు.
జూన్ చివరిలోగా..
జూన్ నెలాఖరులోగా మెట్రో రైలు ప్రయాణికులు, ఎన్సీఎంసీ కార్డులున్న ఇతరులు కూడా నగదు చెల్లించి ఎంటీసీ బస్సుల్లో కూడా ప్రయాణించే సౌకర్యం రానుంది. గతంలోనే దీనిపై ‘చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ’ (సీయూఎంటీఏ).. సీఎంఆర్ఎల్, ఎంటీసీతో చర్చలు జరిపింది. తాజాగా మళ్లీ చర్చలు జరిగిన తర్వాత పథకాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంటూ సీయూఎంటీఏ రెండు సంస్థలకు లేఖ పంపింది. ఎన్సీఎంసీ కార్డు ఎంటీసీ ఎలక్ట్రానిక్ టిక్కెటింగ్ యంత్రాల్లో పని చేసేందుకు కావలసిన ఇతర పనులు ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే లాంఛనంగా సేవలు ప్రారంభిస్తామని సీయూఎంటీఏ అధికారులు పేర్కొన్నారు.
ప్రజా రవాణా చేరువగా..
ఆలందూరు, చెన్నై సెంట్రల్, కీల్పాక్, చెన్నై ఎయిర్పోర్ట్, నందనం, సైదాపేట, లిటిల్ మౌంట్, గిండీ, కోయంబేడు, తిరుమంగళం మెట్రో స్టేషన్లకు బస్టాపులు దగ్గరగానే ఉన్నాయి. నిత్యం స్టేషను నుంచి బయటకు వచ్చే వందలాది మంది ప్రయాణికులకు, దగ్గరి ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంది. ప్రవేశపెట్టబోతున్న ఎన్సీఎంసీ కార్డుతో ప్రజా రవాణా ఎక్కువ మందికి వీలుగా ఉంటుందని సీఎంఆర్ఎల్ అధికారి ఒకరన్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే నిత్య ప్రయాణికులు పలువురు మాట్లాడుతూ.. మెట్రో రైళ్లు, ఎంటీసీ-బస్సులకు కలిపి ఒకే రకమైన కార్డు ప్రవేశపెట్టడంతో ప్రయాణం తేలికగానే ఉంటుందన్నారు. అదే మాదిరిగా ఎన్సీఎంసీ కార్డుతో సబర్బన్, ఎమ్మార్టీఎస్ రైళ్లలో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సీయూఎంటీఏ అధికారులు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించారు. భవిష్యత్తులో రైళ్లలో కూడా వినియోగించుకునేందుకు దక్షిణ రైల్వే అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ