పంట భూముల స్వాధీన ఆదేశాలు ఉపసంహరించుకోవాలి: ఓపీఎస్
కోయంబత్తూరు జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం పంట పొలాలను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం డిమాండ్ చేశారు.
సైదాపేట, న్యూస్టుడే: కోయంబత్తూరు జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం పంట పొలాలను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... రైతుల అనుమతి లేకుండా కోయంబత్తూరులో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు 3,900 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరించమే ద్రావిడ మోడల్ పాలన అని ఎద్దేవా చేశారు. తమిళనాడు పరిశ్రమల అభివృద్ధి సంస్థ ద్వారా కోయంబత్తూరు జిల్లా సిరుముగై వద్ద 4 వేల ఎకరాలు, భవానీసాగర్ జలాశయం వద్ద 1,084 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రణాళిక రచించినట్లు పేర్కొన్నారు. ఈరోడు జిల్లా పెరుందురైలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్నారు. మళ్లీ కొత్తగా ఏర్పాటు చేస్తే కీళ్భవానీ తదితర ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతింటాయని, ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను అన్నాడీఎంకే తరఫున ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
జానకి అమ్మయార్ విగ్రహ ఏర్పాటు
పురట్చి తలైవర్ ఎంజీఆర్ సతీమణి జానకి అమ్మయార్ 100వ జయంతిని పురస్కరించుకుని ఆయన విడుదల చేసిన ప్రకటనలో... పార్టీ కోసం నిరంతరం శ్రమించి, ఎంజీఆర్ వెన్నంటే ఉన్న జానకి అమ్మాళ్కు ఎంజీఆర్ మాళిగైలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే గదికి జానకి అమ్మయార్ పేరు, మొదటి అంతస్తులో ఉండే సమావేశ హాలుకు పురట్చి తలైవి అమ్మ (జయలలిత) పేరు పెట్టాలనే కోరికలు కార్యకర్తల నుంచి వస్తున్నాయని తెలిపారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అదేవిధంగా చెన్నై త్యాగరాయనగర్ ఆర్కాటు రోడ్డులోని ఎంజీఆర్ స్మారక చిహ్నంలో అనుమతి పొంది ఎంజీఆర్, ఆయన సతీమణి జానకి అమ్మయార్కు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే