వెయిట్ లిఫ్టింగ్లో యువకుడి సత్తా
ఇటీవల న్యూజిలాండ్లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాలోని గుడియాత్తానికి చెందిన ఓ యువకుడు నాలుగు బంగారు పతకాలు సాధించి సత్తాచాటాడు.
జాతీయ పతాకంతో జయమారుతి
వేలూర్, న్యూస్టుడే: ఇటీవల న్యూజిలాండ్లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాలోని గుడియాత్తానికి చెందిన ఓ యువకుడు నాలుగు బంగారు పతకాలు సాధించి సత్తాచాటాడు. గుడియాత్తం తాలూకా సివూరు గ్రామానికి చెందిన జయమారుతి (17) బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అనేక క్రీడా పోటీలలో పాల్గొని విజయం సాధించేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 253, 137.5, 245, 635.5 కేజీల విభాగాలలో పాల్గొని నాలుగు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతని స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.