నారాయణస్వామి ఆస్తి వివరాలు తెలియజేయాలి
నారాయణస్వామి తన ఆస్తి వివరాలు తెలియజేయాలని పుదుచ్చేరి సీఎం రంగసామి డిమాండ్ చేశారు. పుదుచ్చేరి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి నమశ్శివాయంకు మద్దతుగా ఉప్పలప్రాంతంలో ప్రచారం చేశారు.
పుదువై సీఎం రంగసామి
మాట్లాడుతున్న సీఎం రంగసామి
ఆర్కేనగర్, న్యూస్టుడే: నారాయణస్వామి తన ఆస్తి వివరాలు తెలియజేయాలని పుదుచ్చేరి సీఎం రంగసామి డిమాండ్ చేశారు. పుదుచ్చేరి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి నమశ్శివాయంకు మద్దతుగా ఉప్పలప్రాంతంలో ప్రచారం చేశారు. రంగసామి మాట్లాడుతూ.. నమశ్శివాయంకు రూ.వెయ్యికోట్ల ఆస్తులు ఉన్నాయని నారాయణస్వామి అంటున్నారన్నారన్నారు. నారాయణస్వామి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, 15ఏళ్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, మరి ఆయనకు ఇంకెన్ని రూ.కోట్ల ఆస్తులు ఉంటాయోనని ప్రశ్నించారు. ఇంతటి ధనవంతుడు ఉన్నారంటే పుదుచ్చేరి ఎంతో పుణ్యం చేసుకున్నట్లేనని చెప్పారు.
పేదలకు కొత్త ఇళ్లు: జయవర్ధన్
సైదాపేట, న్యూస్టుడే: పేదలకు కొత్త హౌసింగ్ బోర్డు ఇళ్లు అందించేందుకు కృషి చేస్తానని దక్షిణ చెన్నై అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. మంగళవారం గిండి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు దక్షిణ చెన్నై ప్రాంతంలో శిథిలావస్థలో ఉండే హౌసింగ్ బోర్డు ఇళ్లకు బదులు కొత్తవి నిర్మించాలని పార్లమెంట్లో డిమాండ్ చేశానని తెలిపారు. ఆ మేరకు పలు ఇళ్లు నిర్మించారన్నారు. ఐదేళ్లలో ఎవరూ ఈ విషయంపై పార్లమెంట్లో గళం విప్పలేదన్నారు. ఆయన వెంట అన్నాడీఎంకే మాజీ మంత్రి గోకుల ఇందిరా, జిల్లా కార్యదర్శి విరుగై రవి తదితరులు ఉన్నారు.
భాజపా పాలనలోకి వస్తే పోలింగ్కేంద్రాలే ఉండవు
మంత్రి అన్బిల్ మహేష్
ఆర్కేనగర్, న్యూస్టుడే: దేశంలో ఇండియా కూటమి పాలనలోకి వస్తే టోల్గేట్లే ఉండవని, అదే భాజపా అధికారంలోకి వస్తే పోలింగ్ కేంద్రాలనేవి ఉండబోవని మంత్రి అన్బిల్ మహేష్ అన్నారు. తంజావూర్ డీఎంకే అభ్యర్థి మురసొలికి మద్దతుగా మంగళవారం మంత్రి అన్బిల్ మహేష్ తిరువైయారు శాసనసభ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అప్పుడాయన మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం ఇండియా కూటమికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. మహిళల మద్దతు అధికంగా ఉందన్నారు. పదేళ్ల కిందట భాజపా పాలనలోకి వచ్చేటప్పుడు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.వెయ్యికి పైగా పెరిగిందన్నారు. మహిళా దినోత్సవం పేరిట ధరలు తగ్గించామని నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. రూ.15 లక్షలు అకౌంట్లో వేస్తామని మోసం చేశారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట