మోదీ పేరు..29 పైసలు
ప్రధాని మోదీని ఇకపై 29 పైసలు పేరుతో పిలవాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచించారు. ఉత్తర చెన్నై డీఎంకే అభ్యర్థి కళానిధి వీరాసామికి మద్దతుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉదయనిధి
కళానిధి వీరాసామికి మద్దతుగా ఓట్లు కోరుతున్న ఉదయనిధి
చెన్నై, న్యూస్టుడే: ప్రధాని మోదీని ఇకపై 29 పైసలు పేరుతో పిలవాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచించారు. ఉత్తర చెన్నై డీఎంకే అభ్యర్థి కళానిధి వీరాసామికి మద్దతుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాధవరం హైరోడ్డులో ఆయన ప్రచారరథం నుంచి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రత్యర్థులందరూ కలిసి కట్టుగా వచ్చినా డీఎంకే కూటమికి భారీ విజయం లభించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు విడిపోయి వేర్వేరు కూటములుగా పోటీ చేయడంతో విజయం మరింత సునాయాసమవుతోందని భావించవద్దని తెలిపారు. పార్టీ అభ్యర్థి విజయానికి గట్టిగానే కృషి చేయాలని కోరారు. ఉత్తర చెన్నైలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలోని అంతరాన్ని తగ్గించేలా రూ.వెయ్యి కోట్లతో ప్రగతి ప్రాజెక్టును పది రోజుల కిందçË ముఖ్యమంత్రి ప్రారంభించారని పేర్కొన్నారు. ఉత్తర చెన్నైలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరించారు. భవిష్యత్తులో ఉత్తర చెన్నైలో ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు, కొడుంగైయూర్లోని డంపింగ్యార్డును పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలతో అన్నాడీఎంకే నేతలను బానిసలుగా చేసుకున్నట్లు డీఎంకే నేతలనూ చేయాలని మోదీ చూస్తున్నారని ఆరోపించారు. ఆయనకు డీఎంకే భయపడదని తెలిపారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ కింద పన్నుగా తీసుకున్న ప్రతి రూపాయికి 29 పైసలు మాత్రమే మోదీ తిరిగి ఇస్తున్నారని, అందుకే ఆయన్ను 29 పైసలు పేరుతోనే పిలవాలన్నారు. తమిళనాడును మాత్రమే వంచిస్తున్న ఆయనకు ఈ ఎన్నికల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
స్వతంత్ర అభ్యర్థుల ఇళ్ల వద్ద పోలీసు భద్రత: డీజీపీ ఆదేశం
ఆర్కేనగర్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు పోలీసు భద్రత ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. పుదుచ్చేరి లోక్సభ స్థానానికి ఏడుగురు రాజకీయ పార్టీల అభ్యర్థులు, 19 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యుర్థులకు ఒక పోలీస్ కానిస్టేబుల్ చొప్పున రోజు మొత్తం భద్రతా విధులు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం పోలీసుశాఖలోని సిగ్మా, ఇంటెలిజెన్స్, క్రైమ్, కోస్ట్గార్డ్, ట్రైనింగ్ స్కూల్ తదితర విధుల్లో ఉండేవారందరినీ నియమించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పలువురు ప్రచారం చేయకుండా నివాసాల్లోనే ఉంటున్నారు. వారికి ఇంటి వద్ద భద్రత కల్పించారు.
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా..
యానం ప్రాంత భాజపా అధ్యక్షుడు తెమ్మాడి దుర్గాప్రసాద్ గత శాసనసభ ఎన్నికల్లో యానం ప్రాంతంలో పోటీ చేయాలని నిర్ణయించారు. యానంలో భాజపా-ఎన్నార్ కాంగ్రెస్ కూటమిలో ముఖ్యమంత్రి రంగసామి బరిలో నిలవగా అసంతృప్తితో దుర్గాప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భాజపా ఆయన్ను పార్టీ నుంచి తొలగించింది. ఆయన అదృశ్యమై ఐదురోజుల తర్వాత తిరిగొచ్చారు. తనను కొందరు కిడ్నాప్ చేసి నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బెదిరించారని చెప్పారు. పోలీసు దర్యాప్తులో ఆయన కిడ్నాప్ నాటకం ఆడినట్లు తేలింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు భద్రత కల్పించాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరణాల రేటు అక్కడే ఎందుకు పెరుగుతోంది?
[ 27-07-2024]
2018 నుంచి 2022 వరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలపై ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా పరిశోధించింది. 2018 నుంచి ఏటా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరణాలు రేటు బాగా పెరుగుతూ వచ్చింది. -
విజయాన్ని సూచించే వేడుకలు
[ 27-07-2024]
కార్గిల్ విజయ్ దివస్ మనకు గర్వకారణమైన విజయాన్ని సూచించే జాతీయ వేడుకలని గవర్నర్ ఆర్.ఎన్.రవి తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కామరాజర్ రోడ్డులోని వార్ మొమోరియల్కు శుక్రవారం నివాళులర్పించారు. -
తమిళనాడు హౌస్లో నిర్మాణాలకు శంకుస్థాపన
[ 27-07-2024]
దిల్లీలోని తమిళనాడు హౌస్ ప్రాంగణంలోని పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో రూ.267 కోట్లతో కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలకు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. -
వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
[ 27-07-2024]
దేశ యువత సాంస్కృతిక రాయబారులుగా ఉండాలని కోరుకున్న స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. -
మిన్మిని ఆడియో, ట్రైలర్ విడుదల
[ 27-07-2024]
హలితా షమీమ్ దర్శకత్వంలో కతిజా రహ్మాన్, గౌరవ్ కాళై, ఎస్తేర్ అనిల్ తదితరులు నటించిన చిత్రం ‘మిన్మిని’. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్, ఆడియో విడుదల వేడుక గురువారం జరిగింది. -
సింగపూర్ ఓడ ప్రమాదం
[ 27-07-2024]
పుదుకోట్టె జిల్లా మేట్టుపట్టికి చెందిన చెల్లకన్ను కుమారుడు షణ్ముగం (26) బీఎస్సీ చదివి రెండేళ్ల క్రితం సింగపూర్లో హార్బర్లో సరకుల ఎగుమతి, దిగుమతి విభాగంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?